twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    SSMB28: మహేశ్ - త్రివిక్రమ్ మూవీపై సర్‌ప్రైజింగ్ న్యూస్.. సర్జరీ అయినా ఆపేది లేదట

    |

    'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' ఇలా ఈ మధ్య కాలంలో హ్యాట్రిక్ హిట్లను తన ఖాతాలో వేసుకుని ఫుల్ జోష్ మీద ఉన్నాడు టాలీవుడ్ బడా హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు. హ్యాట్రిక్ విజయాలు సొంతం అవడంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పటికే పరశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే చిత్రాన్ని మొదలు పెట్టిన ఈ హ్యాండ్సమ్ హీరో.. అది షూటింగ్ జరుగుతోన్న సమయంలోనే దర్శకధీరుడు రాజమౌళితో ప్రాజెక్టును కూడా లైన్‌లో పెట్టుకున్నాడు. ఇది మొదలెట్టక ముందే మరో చిత్రానికి కూడా సిగ్నల్ ఇచ్చేశాడు ఈ స్టార్ హీరో.

    Bigg Boss Nominations: ఈ వారం నామినేషన్‌తో పాటు ర్యాంకులు.. టాప్‌లో అతడు లాస్ట్ ఆమె.. అందరికీ షాక్Bigg Boss Nominations: ఈ వారం నామినేషన్‌తో పాటు ర్యాంకులు.. టాప్‌లో అతడు లాస్ట్ ఆమె.. అందరికీ షాక్

    ప్రస్తుతం పరశురాంతో 'సర్కారు వారి పాట' అనే సినిమాను చేస్తున్న మహేశ్ బాబు.. దీన్ని చాలా వరకూ పూర్తి చేసుకున్నాడు. దాదాపు ఈ సినిమాను సంబంధించిన 70 శాతం షూటింగ్ కంప్లీట్ అయింది. మిగిలిన దాని కోసం షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సూపర్ స్టార్ మోకాలికి సర్జరీ చేయించుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఇందుకోసం అతడు మరికొన్ని రోజుల్లోనే అమెరికాకు వెళ్లబోతున్నాడు. ఇది పూర్తైన తర్వాత అతడు రెండు మూడు నెలలు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. దాని వల్ల ఇప్పుడు చేస్తున్న సినిమాతో పాటు ఫ్యూచర్ ప్రాజెక్టులు సైతం వాయిదా పడతాయని అంటున్నారు.

     SSMB28: Mahesh Babu and Trivikram Movie Starts From February

    మరీ ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మహేశ్ బాబు కొద్ది రోజుల క్రితమే సినిమాను ప్రకటించాడు. నిజానికి ఇది 'సర్కారు వారి పాట' పూర్తైన వెంటనే అంటే డిసెంబర్‌లోనే మొదలవుతుందని వార్తలు వచ్చాయి. కానీ, ఆ చిత్రం కూడా పలు కారణాలతో అనుకున్న సమయానికి పూర్తి కాలేదు. అంతేకాదు, ఇంకా కొంత భాగం బ్యాలెన్స్ ఉండిపోయింది. దీనికితోడు ఇప్పుడు సర్జరీ జరుగుతోన్న నేపథ్యంలో 'సర్కారు వారి పాట' మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. దీంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా ఇప్పట్లో మొదలయ్యే ఛాన్స్‌లు లేవని ప్రచారం జరుగుతోంది.

    మాల్దీవుల్లో సినీ జంట రొమాన్స్: సీక్రెట్‌గా తీసుకున్న వీడియోతో మేటర్ లీక్.. పెళ్లి కాకున్నా ఆ పనులుమాల్దీవుల్లో సినీ జంట రొమాన్స్: సీక్రెట్‌గా తీసుకున్న వీడియోతో మేటర్ లీక్.. పెళ్లి కాకున్నా ఆ పనులు

    మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించనున్న సినిమా గురించి తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటి వారం ప్రారంభం కాబోతుందట. ఆ లోపు మహేశ్ బాబు 'సర్కారు వారి పాట' మూవీని పూర్తి చేస్తాడని తెలుస్తోంది. ఒకవేళ ఫిబ్రవరి నాటికి అందుబాటులో లేకపోయినా.. హీరో లేని సన్నివేశాలను ముందుగా షూట్ చేయాలని త్రివిక్రమ్ డిసైడ్ అయ్యాడట. అంటే.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమా ఫిబ్రవరిలో పట్టాలెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక, ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తైంది.

    ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాలో మహేశ్ బాబు రా ఏజెంట్‌గా కనిపిస్తాడని అంటున్నారు. ఈ చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇక, ఈ చిత్రానికి 'పార్థు', 'అతడే పార్థు' అనే టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది. దీనికి ఎడిటర్‌గా నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టర్‌గా ఏఎస్ ప్రకాశ్, కెమెరామెన్‌గా మథి, మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎస్ థమన్ చేస్తున్నారు.

    English summary
    Mahesh Babu recently Announced his 28 film with Trivikram Srinivas. This Movie Shooting Will Starts From February First Week.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X