Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మహేశ్ బాబు దెబ్బకు కఠిన నిబంధనలు: ‘సర్కారు వారి పాట’లో అవన్నీ నిషేదం
కొంత కాలంగా వరుసగా హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ ఫుల్ ఫామ్తో కనిపిస్తున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలను అందుకున్న అతడు.. ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే సినిమాను చేస్తున్నాడు. దీని షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయినప్పటికీ.. అనివార్య కారణాల వల్ల చిత్రీకరణ మాత్రం చాలా తక్కువే జరిగింది. ఇక, ఈ మధ్యనే సినిమా రెండో షెడ్యూల్ మొదలైంది. ఈ నేపథ్యంలో దీని గురించి ఇటీవలే ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అలాగే, ఇప్పుడు దానిపై ఓ అప్డేట్ వైరల్ అవుతోంది.
'సర్కారు వారి పాట' మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో శరవేగంగా సాగుతోంది. ఇందులో కీలకమైన నటీనటుల మధ్య ఎమోషనల్ సీన్స్ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నుంచి వస్తున్న లీకులపై సూపర్ స్టార్ మహేశ్ బాబు కోపంగా ఉన్నాడని, ఈ మేరకు చిత్ర యూనిట్కు గట్టి వార్నింగ్ ఇచ్చాడని ఈ మధ్య ప్రచారం జరిగింది. తాజా సమాచారం ప్రకారం.. ఇప్పుడు 'సర్కారు వారి పాట' సెట్స్లో కఠినమైన నిబంధనలు పెట్టారని తెలుస్తోంది. అంతేకాదు, ఇప్పుడు షూటింగ్ స్పాట్కు మొబైల్ ఫోన్స్ను అనుమతించకుండా నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
రెచ్చిపోతున్న శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్: సినిమాల్లోకి రాకముందే ఓ రేంజ్లో అందాల ఆరబోత
'సర్కారు వారి పాట' మూవీ బ్యాంకులను మోసం చేసే బడా వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ విమర్శనాత్మకంగా రూపొందుతున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఇందులో మహేశ్ బాబు రెండు డిఫరెంట్ రోల్స్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక, ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ సంక్రాంతికి విడుదల కానుంది.