Don't Miss!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- News దేశంలో ఫస్ట్ టైమ్, పోలీసులకు ఏసీ హెల్మెట్లు, ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి, పండగే పండగ !
- Sports LSG vs CSK: రూ. కోట్లు పలికిన ఆ ఇద్దరిని తప్పించాం- రుతురాజ్
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
సమంత వచ్చాక నాకు, చైతుకి పెద్దగా మాటల్లేవు.. సుకుమార్!
నాగ చైతన్య ఇటీవల శైలజారెడ్డి అల్లుడు చిత్రంతో ఆడియన్స్ ని పలకరించాడు. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీనితో ప్రస్తుతం చైతు దృష్టి సవ్యసాచి చిత్రంపై పడింది. విభిన్నమైన కథాంశంతో దర్శకుడు చందు ముండేటి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నవంబర్ 2 సవ్యసాచి త్రం విడుదలకు సిద్ధం అవుతోంది.
సవ్యసాచి చిత్ర ట్రైలర్ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు స్టార్ డైరెక్టర్ సుకుమార్ హాజరయ్యారు. సుకుమార్ మాట్లాడుతూ.. ఇలాంటి చిత్రాన్ని తాను చేయనందుకు జలసిగా ఫీల్ అవుతున్నానని అన్నారు. ఏ దర్శకుడైనా ఇలాంటి వైవిధ్యం ఉన్న కథతో సినిమా చేయాలని భావిస్తాడు.
ఈ చిత్రం లో నాగ చైతన్య అద్భుత నటన కనబరిచాడని సుకుమార్ ప్రశంసించాడు. సమంత రాక ముందుకు వరకు చైతు, నేను తరచుగా కలుసుకుని మాట్లాడుకునే వాళ్ళం. కానీ సమంత వచ్చాక అది కుదరడం లేదని సుకుమార్ సరదాగా అన్నారు. సవ్యసాచి చిత్రంలో నాగ చైతన్య సరసం నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.