ఇద్దరు క్రేజీ బ్యూటీలతో మహేష్ రొమాన్స్.. సుకుమార్ సినిమా!
సూపర్ స్టార్ మహేష్ చిత్రాల గురించి రోజుకొక ఆసక్తికర వార్త బయటకు వస్తోంది. మహేష్ బాబు ప్రస్తుతం మహర్షి చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తరువాత సుకుమార్ దర్శత్వంలో మహేష్ నటించాల్సి ఉంది. ఈ చిత్రానికి సుకుమార్ కథ సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నాడు.
ఈ చిత్రంలో మహేష్ సరసన నటించే హీరోయిన్ల విషయంలో ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. మహేష్ సరసన భరత్ అనే నేను చిత్రంలో నటించి కైరా అద్వానీ, క్రేజీ బ్యూటీ రష్మిక మందనని హీరోయిన్లుగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. భరత్ అనే నేను చిత్రంతో కైరా అద్వానీ యువతకు బాగా చేరువైంది. ఇక రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఛలో, గీత గోవిందం చిత్రాలతో తెలుగు యువతనిరష్మిక మాయ చేసింది. ఈ ఇద్దరు హీరోయిన్ల విషయంలో అధికారిక ప్రకటన రావలసి ఉంది. 2019 ప్రారంభంలో సుకుమార్, మహేష్ చిత్రం పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











