Don't Miss!
- News కోర్టు తీర్పుతో ఎన్నికల అస్త్రాన్ని కోల్పోయిన వైఎస్ షర్మిల, సునీత.. వాట్ నెక్స్ట్!!
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Sports IPL: ఆ కుర్రాడిపై అంబానీ కన్ను!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఎంజాయ్ చేస్తున్నారు.. చాలా హ్యాపీగా ఉంది: సుకుమార్
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ప్రతిరోజూ పండగే'. చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన రాశీఖన్నా హీరోయిన్గా నటించింది. డిసెంబర్ 20వ తేదీన విడుదలైన ఈ సినిమా మొదటి షోతోనే ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి టాక్ అందుకుంది.
దర్శకుడు మారుతీ తెరకెక్కించిన విధానం, కుటుంబ ప్రేక్షకులను అలరించేలా తీర్చిదిద్దిన సన్నివేశాలు, ముఖ్యంగా కామెడీ సీన్స్ ఆకట్టుకున్నాయి. రావు రమేష్, సత్యరాజ్ పాత్రలకు మంచి స్పందన వచ్చింది. దీంతో కలెక్షన్స్ పరంగా కూడా ఫర్వాలేదనిపించుకుంటోంది 'ప్రతిరోజూ పండగే' మూవీ. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి చిత్ర యూనిట్తో పాటు దర్శకునె సుకుమార్, పరుశురాం, పరుచూరి గోపాలకృష్ణ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వేదికపై క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ.. ''ప్రతిరోజూ పండగే సినిమా సక్సెస్ అయినందుకు హ్యాపీగా ఉంది. ఇండస్ట్రీలో నాకున్న తక్కువ మంది ఫ్రెండ్స్లో బన్నీ వాసు ఒకరు. సైకాలజీ బాగా తెలిసిన వ్యక్తి కనుకనే ఇన్ని సక్సెస్ఫుల్ సినిమాలు తీయగలిగాడు అతను. థియేటర్లో సినిమా చూస్తున్న ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మారుతి ఈ స్థాయికి ఎదగడం సంతోషంగా ఉంది. చాలా ట్యాలెంట్ ఉన్న డైరెక్టర్ లలో ఒకరు మారుతి. ఈ సినిమాలో పనిచేసిన అందరూ టెక్నీషియన్స్, నటీనటులకు అభినందనలు తెలుపుతున్నాను'' అని అన్నారు.