Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
Pushpa 2: బన్నీ ఫ్యాన్స్కు సర్ప్రైజ్.. మొదలెట్టేసిన సుకుమార్ బ్యాచ్
తెలుగు సినిమా రేంజ్ పెరిగిన తర్వాత నుంచి టాలీవుడ్లోని హీరోలందరూ పాన్ ఇండియా రేంజ్ చిత్రాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇలా ఇప్పటికే పలువురు స్టార్లు తమ సత్తాను దేశ వ్యాప్తంగా చూపించి సందడి చేశారు. అందులో దర్శకదీరుడు రాజమౌళి రిఫరెన్స్ లేకుండానే సక్సెస్ అయిన స్టార్ అల్లు అర్జున్. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అతడు నటించిన 'పుష్ప ద రైజ్' పాన్ ఇండియా రేంజ్లో ఐదు భాషల్లో రూపొందింది. అన్ని చోట్లా ఆరంభంలోనే ఈ సినిమా అందరు దృష్టినీ ఆకర్షించింది. ఫలితంగా దీనికి రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అందుకే దీన్ని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 3000కు పైగా థియేటర్లలో రిలీజ్ చేశారు.
బిగ్ బాస్ దివి పరువాల విందు: వామ్మో ఈ డ్రెస్లో ఆమెనిలా చూశారంటే!
క్రేజీ కాంబోలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన 'పుష్ప' మూవీ పాన్ ఇండియా రేంజ్లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో తెరకెక్కింది. ఇలా దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది. అందుకు అనుగుణంగానే అన్ని చోట్లా దీనికి భారీ రెస్పాన్స్ వచ్చి సూపర్ హిట్ అయింది. మరీ ముఖ్యంగా హిందీలో ఈ సినిమా వంద కోట్ల క్లబ్లో కూడా చేరిపోయింది. ఇక, ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 144.90 కోట్లు మేర బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 146 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 175 కోట్లు పైగా వసూలు చేసింది. దీంతో హిట్ స్టేటస్తో పాటు రూ. 35 కోట్లకు పైగా లాభాలు కూడా దక్కాయి.
'పుష్ప' మూవీ రెండు భాగాలుగా రూపొందనుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. మొదటి దాన్ని 'పుష్ప.. ద రైజ్' టైటిల్తో విడుదల చేశారు. అలాగే, ఇప్పుడు రెండో భాగానికి సంబంధించిన షూటింగ్ చేయనున్నారు. దీనికి 'పుష్ప.. ద రూల్' అనే టైటిల్ పెట్టారు. ఈ విషయాన్ని కూడా సినిమాలోనే తెలిపారు. ఇందులో పుష్ప రూలర్గా మారడాన్ని చూపిస్తారు. ఇదిలా ఉండగా.. దీంతో రెండో పార్ట్కు సంబంధించిన షూటింగ్ను మరింత ఉత్సాహంగా జరపాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. త్వరలోనే దీన్ని ప్రారంభించాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది.
పబ్లిక్లో సీరియల్ హీరోయిన్ రొమాన్స్: అతడికి లిప్ కిస్ పెట్టేసి ఘోరంగా!
మొదటి భాగం అనుకున్న దానికంటే భారీ స్థాయిలో విజయాన్ని అందుకోవడంతో 'పుష్ప ద రూల్'పై అంచనాలు మరింతగా నెలకొన్నాయి. దీనికి అనుగుణంగానే చిత్ర యూనిట్ ఈ సారి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగానే 'పుష్ప' భారీ విజయంలో కీలక పాత్రను పోషించిన మ్యూజిక్పై చిత్ర యూనిట్ ఫోకస్ చేసింది. ఈ క్రమంలోనే సుకుమార్.. మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్, లిరిసిస్ట్ చంద్రబోస్తో కలిసి యూరప్ వెళ్లారు. అక్కడ మ్యూజిక్ సిట్టింగ్స్ను ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఫొటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అంతేకాదు, ఇప్పటికే పలు పాటలను కూడా ఫైనల్ చేశారని తెలిసింది.
'ఆర్య', 'ఆర్య 2' తర్వాత అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో వచ్చిన చిత్రమే 'పుష్ప'. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్గా నటించింది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్గా చేశాడు. సునీల్, అనసూయ ఈ చిత్రంలో నెగెటివ్ రోల్స్లో కనిపించారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చాడు. ఇక, 'పుష్ప ద రూల్'లో మరికొందరు ప్రముఖులు నటించబోతున్నారట.