Don't Miss!
- News కేసీఆర్కు మరో షాక్: బీఆర్ఎస్కు కడియం శ్రీహరి, కావ్య గుడ్బై, వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా బరిలో
- Sports RR vs DC: రఫ్ఫాడించిన ఆవేశ్ ఖాన్.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
బాలయ్యతో బాలీవుడ్ హీరో పోరాటం: నటసింహం కోసం సరైనోడిని దింపిన మాస్ డైరెక్టర్
నటసింహా నందమూరి బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. 'సింహా', 'లెజెండ్' వంటి రెండు భారీ హిట్ల తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని తెరకెక్కిస్తున్నాడు బోయపాటి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోందీ చిత్రం. తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది.
బోయపాటి సినిమాలో హీరో పాత్రను ఎంతలా ఎలివేట్ చేస్తాడో.. విలన్ రోల్నూ అదే రీతిలో చూపిస్తాడు. అందునా బాలకృష్ణ లాంటి పవర్ ఫుల్ హీరోతో తలపడే విలన్ను కూడా అంతే రేంజ్లో ఉండాలి. దీన్ని దృష్టిలో ఉంచుకునే BB3లో బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టిని తీసుకుంటున్నారు. గతంలోనే ఈ న్యూస్ ప్రచారం అయినా.. అప్పడు దీనిపై క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ఇందులో నటించేందుకు పచ్చజెండా ఊపాడని తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ కోసం హైదరాబాద్ కూడా రాబోతున్నాడనే టాక్ బాగా వినిపిస్తోంది.
ఎద అందాలతో విష్ణుప్రియ.. సొగసులు, హొయలతో ఆకట్టుకొంటున్న బ్యూటీ (ఫోటోలు)
ఇదిలా ఉండగా, టీజర్ విడుదల చేసిన తర్వాత బాలయ్య - బోయపాటి కాంబోలో రాబోతున్న మూడో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అందుకు అనుగుణంగానే ఈ మూవీ బిజినెస్ కూడా గ్రాండ్గా జరిగిందని తెలుస్తోంది. ఇక, ఇందులో బాలయ్య రెండు విభిన్నమైన పాత్రలను పోషిస్తున్నాడు. ప్రగ్యా జైస్వాల్, సామ్నా కాశీం హీరోయిన్లుగా నటిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ ఎస్ థమన్ దీనికి సంగీతం సమకూర్చుతున్నాడు. నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఈ సినిమా మే 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.