Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మహేష్ బాబుని మెప్పించిన గీత గోవిందం దర్శకుడు!
మహేష్ బాబు ఏ ఏడాది మొత్తం బిజీగా గడిపేలా ఉన్నాడు. మహేష్ నటిస్తున్న తాజా చిత్రం మహర్షి. వంశీ పైడిపల్లి దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అశ్విని దత్, దిల్ రాజు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజ హెగ్డే మహేష్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీత అందిస్తున్నాడు. మహర్షి తర్వాత మహేష్ ఇటీవల్ ఎఫ్2తో ఘనవిజయం సొంతం చేసుకున్న అనిల్ రావిపూడికి అవకాశం ఇచ్చాడు.
తాజాగా గీతగోవిందం ఫేమ్ పరశురామ్ మహేష్ బాబుకు ఓ కథ వినిపించాడట. పరశురామ్ చెప్పిన స్టోరీ లైన్ మహేష్ కు బాగా నచ్చినట్లు తెలుస్తోంది. ఈ కథని పూర్తి స్థాయిలో సిద్ధం చేసి తీసుకురమ్మని మహేష్ పరశురామ్ కు సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. పరశురామ్ స్క్రిప్ట్ ని పక్కాగా సిద్ధం చేసుకుని వెళితే మహేష్ పచ్చ జెండా ఊపడం ఖాయం. మరి పరశురామ్ ఈ అద్భుత అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి.
పరశురామ్ తెరకెక్కించిన గీత గోవిందం చిత్రం 70 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఘనవిజయం సాధించింది. గీత గోవిందం తర్వాత పరశురామ్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించలేదు. అన్ని కుదిరితే మహేష్ బాబుతోనే ఈ దర్శకుడు సినిమా మొదలుపెట్టొచ్చు. మరో వైపు అల్లు అరవింద్ కూడా ఎప్పటినుంచో మహేష్ తో ఓ సినిమా చేయాలని ఎదురుచూస్తున్నారు. వీరి ముగ్గురి కాంబినేషన్ సెట్ అవుతుందేమో చూడాలి.