Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మహేష్ బాబుని మెప్పించిన గీత గోవిందం దర్శకుడు!
మహేష్ బాబు ఏ ఏడాది మొత్తం బిజీగా గడిపేలా ఉన్నాడు. మహేష్ నటిస్తున్న తాజా చిత్రం మహర్షి. వంశీ పైడిపల్లి దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అశ్విని దత్, దిల్ రాజు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజ హెగ్డే మహేష్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీత అందిస్తున్నాడు. మహర్షి తర్వాత మహేష్ ఇటీవల్ ఎఫ్2తో ఘనవిజయం సొంతం చేసుకున్న అనిల్ రావిపూడికి అవకాశం ఇచ్చాడు.
తాజాగా గీతగోవిందం ఫేమ్ పరశురామ్ మహేష్ బాబుకు ఓ కథ వినిపించాడట. పరశురామ్ చెప్పిన స్టోరీ లైన్ మహేష్ కు బాగా నచ్చినట్లు తెలుస్తోంది. ఈ కథని పూర్తి స్థాయిలో సిద్ధం చేసి తీసుకురమ్మని మహేష్ పరశురామ్ కు సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. పరశురామ్ స్క్రిప్ట్ ని పక్కాగా సిద్ధం చేసుకుని వెళితే మహేష్ పచ్చ జెండా ఊపడం ఖాయం. మరి పరశురామ్ ఈ అద్భుత అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి.
పరశురామ్ తెరకెక్కించిన గీత గోవిందం చిత్రం 70 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఘనవిజయం సాధించింది. గీత గోవిందం తర్వాత పరశురామ్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించలేదు. అన్ని కుదిరితే మహేష్ బాబుతోనే ఈ దర్శకుడు సినిమా మొదలుపెట్టొచ్చు. మరో వైపు అల్లు అరవింద్ కూడా ఎప్పటినుంచో మహేష్ తో ఓ సినిమా చేయాలని ఎదురుచూస్తున్నారు. వీరి ముగ్గురి కాంబినేషన్ సెట్ అవుతుందేమో చూడాలి.