Don't Miss!
- News ఎన్నికల వేళ ఆలీ కీలక నిర్ణయం..!!
- Finance DA Hike: కోటి మంది ఉద్యోగులకు శుభవార్త.. మార్చి 30 నుంచి పెరిగిన జీతాలు..!!
- Lifestyle ఈ అలవాట్లు ఉన్నవారికి తీవ్ర కడుపులో అల్సర్ వచ్చే అవకాశం ఉంది...వెంటనే బయటపడండి...!
- Sports కొట్టింది SRH..కొట్టించుకుంది MI..నొప్పి మాత్రం RCBకి!
- Automobiles జనరల్ టికెట్ ప్యాసింజర్స్తో ఫుల్ రష్గా రిజర్వ్డ్ కోచ్లు.. ప్రయాణికుడి కంప్లెయింట్, రైల్వే శాఖ సీరియస్
- Technology వన్ప్లస్ నార్డ్ CE 4 ధరల వివరాలు లీక్.. గత మోడల్ కంటే తక్కువ ధరకే అందుబాటులోకి..!
- Travel శివ కళ్యాణోత్సవాలకు ముస్తాబైన వేములవాడ రాజన్న ఆలయం!
రజని ద్విపాత్రాభినయంలో నటిస్తున్నాడు.. కానీ ఆ పాత్ర చేయడం లేదు!
సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ వయసులో కూడా వరుస చిత్రాలతో దూసుకుపోతున్నారు. గత ఏడాది రజిని కాలా, 2.0 చిత్రాలతో సందడి చేశారు. ఈ ఏడాది ఆరంభంలోనే కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో నటించిన పేట చిత్రం విడుదలయింది. ఇదిలా ఉండగా సంచలన దర్శకుడు ఏఆర్ మురుగదాస్ రజనీకాంత్ తో చిత్రానికి ప్లాన్ చేస్తున్నారు. గత ఏడాది మురుగదాస్ దర్శకత్వం వహించిన సర్కార్ చిత్రం రికార్డ్ వసూళ్లు రాబట్టింది.
రజనీకాంత్ తో మురగదాస్ తెరకెక్కించబోయే చిత్రం గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. ఏ చిత్రంలో రజనీకాంత్ డ్యూయెల్ రోల్ లో నటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఓ పాత్రలో రాజకీయనాయకుడిగా కనిపిస్తారని అంటున్నారు. తాజాగా ఈ వార్తలు అవాస్తవం అని తేలింది. రజనీ ద్విపాత్రాభినయంలో నటించనుండడం వాస్తవమే. కానీ రాజకీయ నాయకుడి పాత్ర చేయడం లేదు. అది కేవలం పుకారు అని అంటున్నారు.
ఓ పాత్రలో పోలీస్ అధికారిగా మరో పాత్రలో సామజిక సేవకుడిగా కనిపిస్తారని అంటున్నారు. 2.0 చిత్రాన్ని నిర్మించిన లైకా సంస్థే ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తోంది. అనిరుద్ ఈ చిత్రాన్ని సంగీతం అందిస్తున్నాడు. రజని, మురుగదాస్ తొలి కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఫ్యాన్స్ భారీగా ఆశలు పెట్టుకుని ఉన్నారు.