Don't Miss!
- Finance Cerelac News: పేదదేశాల సెరెలాక్ ఉత్పత్తులో పంచదార..!! FSSAIకి నోటీసులు జారీ..
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Sports చెన్నై సూపర్ కింగ్స్లో భారీ మార్పులు..!!
- News పవన్ కల్యాణ్ దూకుడు - తాజా నిర్ణయంతో..!!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మహర్షి విడుదల మళ్ళీ వాయిదా.. కారణం ఇదే!
సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న తాజా చిత్రం మహర్షి. రైతు సమస్యల నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతోంది. వంశీ పైడిపల్లి దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అశ్విని దత్, దిల్ రాజు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజ హెగ్డే మహేష్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం దర్శకుడు వంశీ పైడిపల్లి చిత్రంలో అంత్యత కీలకమైన ఫైట్స్ సీన్ చిత్రీకరణ జరుపుతున్నాడు. రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న ఈ షూటింగ్ లో మహేష్ బాబు బిజీగా పాల్గొంటున్నాడు.
ఈ చిత్ర విడుదల గురించి మరోసారి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. మహర్షి సినిమా మళ్ళీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయట. మహర్షి చిత్రాన్ని ముందుగా ఏప్రిల్ 5న విడుదల చేయాలని భావించారు. షూటింగ్ ఆలస్యం కావడంతో విడుదల తేదీని ఏప్రిల్ 25కు మార్చారు. తాజా సమాచారం ప్రకారం ఈ తేదీ కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
మహర్షి చిత్రానికి సంబంధించి ఇంకా 30 రోజుల షూటింగ్ జరపాల్సి ఉందట. దీనికి తోడు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఎలాగు ఉన్నాయి. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న చిత్రం కాడంతో అన్ని పక్కాగా చిత్రీకరించేటప్పటికీ ఇంకాస్త ఎక్కువ సమయం కూడా పట్టొచ్చు. ఏది ఏమైనా మహర్షి చిత్రం విడుదల ఎప్పుడనేది చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటిచాల్సి ఉంది.