Don't Miss!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Lifestyle మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- News రఘురామకు సీటు పై కసరత్తు - కీలక ప్రతిపాదన, ఖాయమయ్యేనా..!!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
నిజజీవిత నాయకుడు.. వెండితెర కథానాయకుడు ‘రంగా’
అది అల వైకుంఠపురం కాదు... విజయవాడ మహానగరం. పైగా అది రాజకీయాల రాజధాని. అక్కడంతా సరిలేరు నాకెవ్వరూ అనుకునేవారే. అలాంటి రాజధాని కంట్లో రంగా అనే నలుసు పడింది. నలిపేయడానికి అది సాధ్యమయ్యేది కాదు. కన్ను వాచిపోవడం తప్ప అదెక్కడికీ పోదు. పక్కలో బల్లెంలా తయారయ్యే సరికి శత్రువులూ ఎక్కువయ్యారు. రోట్లో తల పెట్టాక రోకటి పోటుకు భయపడే రకం కాదు రంగా. అక్కడి రాజకీయానికి బలుపు ఎక్కువయ్యింది... మలుపులూ ఎక్కువయ్యాయి. అలాంటి యథార్థ ఘటనల నేపథ్యంలో తెరకెక్కబోతోన్న రంగా చిత్రం నుంచి ఓ అప్డేట్ వచ్చేసింది.
బెజవాడలో ఓ పక్క కాంగ్రెస్లో అంతర్గత రాజకీయం, మరో పక్క తెలుగు దేశంలో ప్రత్యర్థి 'దేవినేని' చాణక్యం. ఆ పద్మ వ్యూహ్యంలో అభిమన్యుడే అయ్యాడు రంగా. ఆరోజే డిసెంబర్ 26. అక్కడి రౌడీయిజంలో రంగా అనే నిజం లేకుండా పోయింది. అసలు రంగా ఎవరు? ఈ దేవినేని ఎవరు? ఈ ఇద్దరూ ప్రత్యర్థులా? మిత్రులా? వీరి మధ్య ఏం జరిగింది. అది తెలుసుకోవాలంటే 'దేవినేని' చూడాల్సిందే.. ఇందులో దేవినేనిగా నందమూరి తారకరత్న, రంగా పాత్రలో సురేష్ కొండేటి నటిస్తున్నారు.
శివనాగేశ్వర్రావు (శివనాగు) దర్శకత్వంలో ఆర్.టి.ఆర్ ఫిలింస్ పతాకంపై రామూరాథోడ్, జి.ఎస్.ఆర్.చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఓ పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది. ఈ పాటను అమలాపురంలో చిత్రీకరిస్తున్నారని యూనిట్ తెలిపింది. ఈ పాటతో సినిమా మొత్తం పూర్తవుతుందని పేర్కొంది. చిత్ర దర్శకుడు శివనాగు మాట్లాడుతూ.. ఈ డిసెంబర్ 26న రంగా వర్ధంతి. మా సినిమా చిత్రీకరణ కూడా ఈరోజే మొదలైంది. రేపటితో పూర్తవుతుంది. ముఖ్యంగా రంగా పాత్ర ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తుంది. సురేష్ కొండేటిని ఈ సినిమా నుండి రంగా సురేష్ అంటారేమోనని తెలిపాడు. ఈపాట చిత్రీకరణ పూర్తయిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభిస్తామని చెప్పారు. ఇందులో హీరోయిన్లుగా నవీనారెడ్డి, తేజా రెడ్డి నటిస్తున్నారు. రాజ్ కిరణ్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.