Don't Miss!
- Sports సూపర్ సండే: సునామీ సన్రైజర్స్ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- News గంటాకు సీటు ఖరారు - టీడీపీ తుది జాబితా విడుదల, లిస్టులో..!!
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
సూర్య పొలిటికల్ మూవీ ‘ఎన్.జి.కె’ రిలీజ్ వాయిదా?
తమిళ స్టార్ సూర్య త్వరలో 'ఎన్.జి.కె' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ టీజర్ ఇటీవల విడుదలై అద్భుతమైన స్పందన సొంతం చేసుకోవడంతో పాటు ఇంటర్నెట్లో వైరల్ అయింది. దాదాపు 8 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది.
ఈ చిత్రం తమిళ న్యూ ఇయర్ సందర్భంగా ఏప్రిల్ రెండో వారంలో విడుదల చేస్తారని అంతా భావించారు. అయితే సినిమా అప్పుడు విడుదలయ్యే అవకాశం లేదని తాజాగా తమిళ సినీ వర్గాల్లో ప్రచారం మొదలైంది. ప్రోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం అవ్వడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
మే చివరి వారంలో 'ఎన్.జి.కె' విడుదలయ్యే అవకాశం ఉందని టాక్. అయితే చిత్ర బృందం నుంచి రిలీజ్ విషయంలో ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఈ చిత్రంలో సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వం వహిస్తుండగా ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చారు.