Don't Miss!
- News సీఎం పదవి ఊడిపోతుంది, మేము కొట్లాడుకుంటే మీ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఈగనోడి !
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Finance Amitabh Kant: 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించండి.. గర్జించిన కంగన, అంకిత, కృతి సనన్
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం కేసును సీబీఐకి అప్పగించాలనే డిమాండ్ పెరుగుతున్నది. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్, సుశాంత్ మాజీ ప్రేయసి అంకితా లోఖండే, హీరోయిన్ కంగన రనౌత్ లాంటి తారలు ప్రస్తుతం జరుగుతున్న ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. దేశవ్యాప్తంగా పలువురు నటీనటులు బహిరంగంగా సీబీఐ డిమాండ్కు మద్దతు తెలియజేస్తున్నారు.
కృతిసనన్ తన ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్టు ద్వారా స్పందిస్తూ.. త్వరలోనే నిజాలు బయటకు రావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. సుశాంత్ ఫ్యామిలీ, స్నేహితులు, అభిమానులు, అతడిని ఇష్టపడే ప్రతీ ఒక్కరికి న్యాయం జరుగాలని కోరుకొంటున్నాను. ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా సీబీఐ కేసును దర్యాప్తు చేసి వాస్తవాలను బయటపెట్టాలని ప్రార్థిస్తున్నాను. అలా న్యాయం జరిగితే సుశాంత్ ఆత్మకు సంపూర్ణంగా శాంతి చేకూరుతుంది. అందుకే సీబీఐ దర్యాప్తు కోరుతున్నాను అని అన్నారు.
కంగన రనౌత్ టీమ్ ట్వీట్టర్లో స్పందిస్తూ.. త్వరగా ఈ కేసును ముగించే తొందరలో ముంబై పోలీసులు ఉన్నారు. సంజయ్ రౌత్ లాంటి నేతలు విచారణ ముగిసిందని బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు. సుశాంత్ కేసులో న్యాయం జరగాలని కోరుకొంటున్నాను అని అన్నారు.
సుశాంత్ కేసులో న్యాయం జరుగాలని దేశం మొత్తం కోరుకొంటున్నది. కాబట్టి సుశాంత్కు న్యాయం జరగాలంటే సీబీఐ దర్యాప్తు జరగాల్సిందే అని అంకితా లోఖండే పోస్టర్తో డిమాండ్ చేశారు.