Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సుశాంత్ కేసులో సీబీఐ కీలక నిర్ణయం.. రియా తల్లిదండ్రులను కూడా..
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం కేసులో ఈడీ, సీబీఐ, ఎన్సీబీ సంస్థలు తమ దర్యాప్తు జోరును పెంచేశారు. గత 12 రోజులుగా ఎడతెగని విచారణను అధికారులు కొనసాగిస్తున్నారు. గత ఐదు రోజులుగా రియా చక్రవర్తిని సీబీఐ అధికారులు గంటల తరబడి ప్రశ్నించారు.
అయితే మంగళవారం రియాకు ఈడీ సమన్లు జారీ చేయలేదని ఆమె తరఫు న్యాయవాది సతీష్ మానేషిండే స్పష్టం చేశారు. అయితే ఈ కేసులో సుశాంత్ తల్లిదండ్రులను సీబీఐ విచారించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
గత ఐదురోజులుగా రోజుకు దాదాపు 10 గంటల చొప్పున ప్రశ్నించడం మీడియాలో చర్చనీయాంశమైంది. సుశాంత్ బ్యాంకు అకౌంట్లలో అవకతవకల ఆరోపణలు, హార్డ్ డిస్క్లలో డేటా డిలీట్ తదితర అంశాలపై లోతుగా ప్రశ్నించినట్టు సమాచారం.
అయితే మీడియాలో ట్రయల్స్పై రియా చక్రవర్తితోపాటు కుటుంబ సభ్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మీడియా ప్రతినిధులపై శాంతాక్రజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను వేధిస్తున్నట్టు మీడియాపై ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయడం వివాదంగా మారింది.