Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సుశాంత్ సూసైడ్: బాలీవుడ్ సెలబ్రిటీని 5 గంటలపాటు ప్రశ్నించిన పోలీసులు
సుశాంత్ సింగ్ రాజ్పుత్ సూసైడ్ కేసులో ముంబై పోలీసుల విచారణ నిరంతరంగా కొనసాగుతున్నది. గతవారం దర్శకులు సంజయ్ లీలా భన్సాలీ, శేఖర్ కపూర్ను విచారించిన బాంద్రా పోలీసులు అదే జోరును కొనసాగించారు. జూలై 10వ తేదీన బాలీవుడ్ పరిశ్రమలో టాలెంట్ మేనేజర్గా పనిచేస్తున్న రేష్మా శెట్టిని విచారించారు. దాదాపు 5 గంటలపాటు ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఆమెను విచారించినట్టు సమాచారం.
బాలీవుడ్లో రేష్మా శెట్టికి బలమైన సంబంధాలు ఉన్నాయి. అగ్ర నటులు సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, ఆలియా భట్ లాంటి వారితో కలిసి పనిచేశారు. కత్రినా కైఫ్, పలువురు యాక్టర్లు ఎండార్స్ చేసే వాణిజ్య ప్రకటనలను రేష్మా హ్యాండిల్ చేస్తూ ఉన్నారు.
బిగ్బాస్, సల్మాన్ ఖాన్ బీయింగ్ హ్యుమన్ లాంటి సంస్థలతో పనిచేస్తున్నారు. ామె మ్యాట్రిక్స్ అనే టాలెంట్ మేనేజ్మెంట్ కంపెనీకి అధినేత్రిగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో రేష్మాను పోలీసుల విచారించి సుశాంత్ వ్యక్తిగత విషయాలను అడిగి తెలుసుకొన్నట్టు సమాచారం.
Recommended Video
జూన్ 14వ తేదీన సుశాంత్ సూసైడ్ చేసుకొన్న తర్వాత ఇప్పటి వరకు 35 మందిని ముంబై పోలీసులు ప్రశ్నించి వారి వాగ్మూలాలను రికార్డు చేశారు. సాధ్యమైనంత వరకు ఈ కేసుకు సంబంధించిన బాలీవుడ్ ప్రముఖులను ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు.