twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆయనతో అవి విలువైన జ్ఞాపకాలు.. వాటిని ఎప్పటికీ మరచిపోలేను.. మెగాస్టార్ కూతురు సుస్మిత

    |

    మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత మంచి కాస్ట్యూమ్ డిజైనర్ అనే విషయం తెలిసిందే. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ఫ్యాషన్ డిగ్రీ పొందిన ఆమె.. కాస్ట్యూమ్ డిజైనర్‌గా తన వృత్తిని ఎంచుకొని ముందుకు సాగుతోంది. పలు సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేస్తూ వృత్తి పట్ల నిబద్దత, టాలెంట్ చాటుకుంటోంది. ఈ కోవలోనే తండ్రి మెగాస్టార్ చిరంజీవి తాజా సినిమా 'సైరా నరసింహా రెడ్డి'కి కూడా కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసింది సుస్మిత. తాజాగా అందుకు సంబంధించి తన ఫీలింగ్స్ పంచుకుంది. ఆ వివరాలు చూస్తే..

    చిరంజీవి సినిమాలకు పని చేస్తూ

    చిరంజీవి సినిమాలకు పని చేస్తూ

    ఫ్యాషన్ టెక్నాలజీలో చదువును సానబెడుతూ కాస్ట్యూమ్ డిజైనర్‌గా రాణిస్తోంది సుస్మిత. ఈ మేరకు తన తండ్రి చిరంజీవి సినిమాలకు పని చేస్తూ భేష్ అనిపించుకుంటోంది. గతంలో మెగాస్టార్ కమ్ బ్యాక్ మూవీ 'ఖైదీ నెంబర్ 150' సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసిన ఆమె.. ఇప్పుడు 'సైరా నరసింహా రెడ్డి'కి కూడా ఆ బాధ్యతలు చేపట్టింది.

    లెజెండ్ అమితాబ్ ప్రశంస

    లెజెండ్ అమితాబ్ ప్రశంస

    కాస్ట్యూమ్ డిజైనర్‌గా సుస్మిత పనితనాన్ని చూసిన బిగ్ బీ అమితాబ్ బచ్చన్.. ఆమెను ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయనతో ఓ ఫోటో దిగింది సుస్మిత. తాజాగా ఆ ఫొటోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ.. తాను డిజైన్ చేసిన దుస్తుల విషయంలో లెజెండ్ అమితాబ్ తనను ప్రశంసించడం పట్ల ఆనందం వ్యక్తం చేసింది.

    ఎంతో విలువైనవి.. ఎప్పటీకీ మరచిపోలేను

    బిగ్‌బీతో పనిచేసిన ఆ జ్ఞాపకాలు ఎంతో విలువైనవని, ఆ జ్ఞాపకాలను ఎప్పటికీ మరిచిపోలేననని ఆమె తెలిపింది. ఈ మేరకు సిల్వర్ స్క్రీన్‌పై మిమ్మల్ని చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటూ తన ఇన్స్‌స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేసింది సుస్మిత. దీంతో ఆమె చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    గతంలో తమన్నా ఏమందంటే..

    గతంలో తమన్నా ఏమందంటే..

    గతంలో ఓ కార్యక్రమంలో సుస్మిత డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ గురించి తమన్నా స్పందించింది. ''చారిత్రాక నేపథ్యంలో తెరకెక్కుతున్న సైరా నరసింహా రెడ్డి చిత్రంలో నేను యువరాణిగా నటిస్తున్నాను. ఈ మేరకు చిత్రంలో కాస్ట్లీ లెహెంగా ధరించాను. ఇప్పటివరకు నేను ధరించిన ఖరీదైన దుస్తులు ఇవే. చిరంజీవి కుమార్తె సుస్మిత, ప్రముఖ డిజైనర్ అంజు మోడీ కలసి వీటిని డిజైన్ చేశారు'' అని ఆమె తెలిపింది.

    సైరా నరసింహా రెడ్డి మూవీ

    సైరా నరసింహా రెడ్డి మూవీ

    కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటించింది. అమితాబ్ బచ్చన్, తమన్నా, కుచ్చ సుదీప్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 2న భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

    English summary
    Periodical drama Sye Raa Narasimhaa Reddy is ready for release on October 2nd. Tamannaah played a important role in this movie. Nayanatara and chiranjeevi will be highlight in this movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X