Don't Miss!
- News మే 1 నుంచి ఈ రాశులకు అఖండ ధనయోగం
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
Sye Raa Latest update: 35 రాత్రులు.. 2000 మంది ఆర్టిస్టులు.. మెగా మూవీలో హైలైట్ సీన్ ఇదే
మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహా రెడ్డి గురించిన ఆసక్తికర అప్డేట్ తెలుపుతూ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది మెగా యూనిట్. వెండితెరపై అబ్బురపరిచే అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. ఆ సమయం ఆసన్నమైంది అని పేర్కొంటూ ట్వీట్ చేశారు. దీంతో మెగా అభిమానుల్లో ఇప్పటికే ఉన్న ఆత్రుత రెట్టింపయింది. సైరా విడుదల తేదీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్.
షూటింగ్ ఫినిష్.. జోరుగా ప్రమోషన్స్
మెగాస్టార్ కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కింది సైరా నరసింహా రెడ్డి సినిమా. ఇటీవలే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈ మేరకు ఇటీవలే గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు.
కొత్త పోస్టర్.. ఆ విషయం చెప్పేశారు
సైరా ప్రమోషన్స్లో భాగంగా సరికొత్త పంధాలో వెళ్తోంది చిత్రయూనిట్. ఈ మేరకు తాజాగా కొత్త పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ ద్వారా సినిమాలో హైలైట్ గా సన్నివేశం తాలూకు వివరణ ఇచ్చారు. ఈ సన్నివేశం కోసం సైరా టీమ్ పడిన కష్టం, వెచ్చించిన సమయం గురించి తెలిపారు.
35 రాత్రులు.. 2000 మంది ఆర్టిస్టులు
సైరా నరసింహా రెడ్డి సినిమాలో పోరాట ఘట్టాలు హైలైట్ అవుతాయని టీజర్, ట్రైలర్ ద్వారానే తిలిసిపోయింది. అయితే ఈ సినిమాలో నోస్సం ఫోర్ట్ యాక్షన్ సీక్వెన్స్ మేజర్ హైలైట్గా నిలుస్తుందని తాజా పోస్టర్ ద్వారా చెప్పేసింది చిత్రయూనిట్. ఇందుకోసం 35 రాత్రులు.. 2000 మంది ఆర్టిస్టులు కష్టపడ్డారని, దేశ విదేశాలకు చెందిన జూనియర్ ఆర్టిస్టులతో ఈ సన్నివేశం అత్యంత గ్రాండ్గా చిత్రీకరించామని తెలిపారు.
టీజర్, ట్రైలర్ సెన్సేషన్
సైరా నరసింహా రెడ్డి సినిమా టీజర్, ట్రైలర్ ఇప్పటికే నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఈ వీడియోల్లో చూపించిన సన్నివేశాలు ప్రేక్షకలోకాన్ని అబ్బురపరిచాయి. దీంతో సైరా టీజర్, ట్రైలర్ సోషల్ మీడియాలో వ్యూస్ పరంగా సరికొత్త రికార్డులకు తెరలేపాయి. సినిమాపై ఉన్న అంచనాలకు రెక్కలు కట్టాయి.
యూ/ఏ సెన్సార్ సర్టిఫికెట్
ఇక సైరా మూవీకి సంబంధించిన సెన్సార్ గురించి చెప్పుకుంటే.. సెప్టెంబర్ 23న సైరా రిపోర్ట్ వచ్చింది. సెన్సార్ సభ్యులు ఈ సినిమాపై పూర్తిస్థాయిలో సంతృప్తిని వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ అందించారు. దీంతో కొన్ని వివాదాల నడుమ ఉన్న సైరా నరసింహా రెడ్డి సినిమా రిలీజ్కి లైన్ క్లియర్ అయింది.
సైరా నరసింహా రెడ్డి మూవీ
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్పై రామ్ చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి లీడ్ రోల్ పోషించగా.. అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు. అక్టోబర్ 2న భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.