twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇండియన్ ఆర్మీ కోసం ప్రత్యేకంగా సైరా.. దేశం గర్వించే విధంగా ప్లాన్!

    |

    మెగాస్టార్ ప్రతిష్టాత్మక సినిమా 'సైరా నరసింహా రెడ్డి' అన్ని దారుల్లోనూ ప్రశంసలు అందుకుంటోంది. తీసుకున్న కథ, సినిమా తెరకెక్కించిన విధానం, నటీనటుల అభినయం అన్నింటా ప్రశంసలు దక్కించుకున్న సైరా.. దేశం గర్వించే విధంగా మరో ప్రశంస అందుకుంటోంది. దేశ సైనికుల కోసం సైరా ప్రత్యేక ప్రదర్శన వేస్తుండటం హాట్ టాపిక్‌గా మారింది.

    ఆ నాటి పరిస్థితులకు అద్దంపడుతూ

    ఆ నాటి పరిస్థితులకు అద్దంపడుతూ

    తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు, రేనాటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్రను కళ్ళకు కట్టినట్లు చూపించారు డైరెక్టర్ సురేందర్ రెడ్డి. 1920 నాటి పరిస్థితులను, తెలుగు ప్రజలపై ఇంగ్లీష్ వారి పెత్తనం, ఆ పెత్తనం సహించని ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి తిరుగుబాటుకు ప్రాణం పోస్తూ సన్నివేశాల చిత్రీకరణ చేసింది సైరా యూనిట్.

     వెనక్కి తగ్గని రామ్ చరణ్.. సినిమా రేంజ్

    వెనక్కి తగ్గని రామ్ చరణ్.. సినిమా రేంజ్

    ఇక సైరా సినిమా నిర్మాణ బాధ్యతలు చేప్పట్టిన రామ్ చరణ్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ కేటాయించి తండ్రికి కానుక ఇచ్చారు. ఇక సైరాలో ఉయ్యాలవాడ వీరుడిగా చిరంజీవి అభినయం ప్రేక్షకులను రక్తి కట్టించింది. కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి, అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా రోల్స్ సినిమా రేంజ్ పెంచేశాయి.

     ఇండియన్ ఆర్మీ కోసం ప్రత్యేకంగా

    ఇండియన్ ఆర్మీ కోసం ప్రత్యేకంగా

    విడుదల తరువాత ఘనవిజయం సాధించిన ఈ సినిమాను ఇండియన్ ఆర్మీ కోసం ప్రత్యేకంగా ప్రదర్శిస్తూ సైరా ప్రత్యేకత చాటుకుంటున్నారు. కర్ణాటక డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ ఎంటర్‌ప్రైజస్ వారు బెంగళూరులో ఇండియన్ ఆర్మీ కోసం ప్రత్యేకంగా 60 షోస్ ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలతో కూడిన పోస్టర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దేశం గర్వించదగిన సినిమాను దేశం గర్వించే విధంగా ప్లాన్ చేశారని అంటున్నారు ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు.

    సైరా కలెక్షన్ల సునామీ

    సైరా కలెక్షన్ల సునామీ

    మరోవైపు సైరా కలెక్షన్ల సునామీ ఇప్పట్లో ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. సినిమాకు హాలీడే సీజన్‌ బాగా కలిసొచ్చింది. దీంతో కలెక్షన్స్ పరంగా యమ స్పీడ్‌గా దూసుకెళ్తోంది సైరా. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల గ్రాస్ రాబట్టి సరికొత్త రికార్డు నమోదు చేసింది. అత్యంత వేగంగా 200 కోట్ల గ్రాస్ వసూలు చేసిన నాలుగో చిత్రంగా నిలిచింది సైరా నరసింహా రెడ్డి నిలవడం విశేషం.

    English summary
    Periodical drama Sye Raa Narasimhaa Reddy is released on october 2. On first day first show this movie got possitive talk. So this movie gets huze collections worldwide. Now One Distributer arranged Sye Raa Narasimhaa Reddy Special Shows For Indian Army.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X