Don't Miss!
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- News ఏపీలో కూటమికి వచ్చే సీట్లు ఇవే- రఘురామ తాజా అంచనా..!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Lifestyle మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
న్యూ పోస్టర్: ‘సైరా’ టీజర్ కోసం ఉత్కంఠగా ఫ్యాన్స్!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'సైరా నరసింహారెడ్డి' మూవీ టీజర్ విడుదలకు ముమూర్తం దగ్గరపడుతున్న కొద్దీ అభిమానుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. రేపు (ఆగస్టు 21) ఉదయం 11.30 గంటలకు టీజర్ విడుదల చేయబోతున్న నేపథ్యంలో మెగా ఫ్యామిలీ పీఆర్ఓ, నిర్మాత ఎస్కెఎన్ ట్విట్టర్ ద్వారా కొత్త పోస్టర్ విడుదల చేశారు.
The wait has almost come to an end. Unveiling teaser of the Magnum opus #SyeRaaNarasimhaReddy tomorrow at 11:30AM. #SyeRaa #SyeRaaJourneyBegins #HBDMegastarChiranjeevi pic.twitter.com/iH6IMtRvDB
— SKN - Geetha Govindam Blockbuster (@SKNonline) August 20, 2018
'సైరా' టీజర్ కోసం కేలం అభిమానులు మాత్రమే కాదు... యావత్ సినీ పరిశ్రమ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. మెగాస్టార్ కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం ఇది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మాతగా దాదాపు రూ. 150 నుండి రూ. 200 కోట్ల బడ్జెట్ రేంజిలో హిస్టారికల్ బ్యాక్ డ్రాప్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
టాలీవుడ్ మెగాస్టార్తో పాటు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇందులో ఉండటం, విజయ్ సేతుపతి, నయనతార, సుదీప్, జగపతిబాబు లాంటి ప్రముఖులు నటిస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. బ్రిటిష్ సైన్యంపై నరసింహారెడ్డి యుద్ధం చేసే సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. సినిమాలో ఈ పోరాట సన్నివేశాలు హైలెట్గా ఉంటాయని చిత్ర బృందం చెబుతోంది.
ఆదివారం గీత గోవిందం సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్న చిరంజీవి.... తీరిక లేకుండా షూటింగ్ జరుగుతోందని, ఒక్కోసారి రాత్రి 2 గంటల వరకు చిత్రీకరణ చేస్తున్నామని, వందల సంఖ్యలో ఆర్టిస్టులు ఇందులో పాల్గొంటున్న విషయం వెల్లడించారు. 2019లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.