Don't Miss!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Lifestyle మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- News రఘురామకు సీటు పై కసరత్తు - కీలక ప్రతిపాదన, ఖాయమయ్యేనా..!!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
ఆ సినిమా కోసం కదిలొచ్చిన మంత్రి.. తలసాని కామెంట్స్ వైరల్
ఓ సినిమాను ప్రమోట్ చేసేందుకు చిత్రయూనిట్ రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరేమో స్టార్ హీరోల చేతుల మీదుగా ప్రమోట్ చేయించుకుంటారు.. ఇంకొందరు దర్శకుల చేతలు మీదగా చేయిస్తుంటారు. ఇంకొందరు రాజకీయ నాయకుల చేతుల మీదుగా తమ సినిమా అప్డేట్లను రిలీజ్ చేయిస్తుంటారు. ఈక్రమంలోనే మొన్నా మధ్య ఈ కథలో పాత్రలు కల్పితం అనే పాటను వైఎస్ షర్మిల చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. అది బాగానే వర్కవుట్ అయింది.
అందుకే ఈ సారి తెలంగాణ మంత్రిని పట్టుకొచ్చారు. సినిమాటోగ్రఫర్ మినిష్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్.. ఈ మూవీ కోసం కదిలి వచ్చారు. సినిమా రిలీజ్ డేట్ పోస్టర్ను రిలీజ్ చేశాడు. పవన్ తేజ్ కొణిదెల, మేఘన జంటగా నటిస్తున్న చిత్రం 'ఈ కథలో పాత్రలు కల్పితం'. అభిరామ్ ఎమ్. దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ని మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రాజేష్ నాయుడు నిర్మిస్తున్నారు.
ఇటీవలే సెన్సార్ పనులను జరుపు\కున్న ఈ సినిమా మార్చి 19 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. కాగా ఈ రిలీజ్ డేట్ పోస్టర్ను సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ కథలో పాత్రలు కల్పితం సినిమా టైటిల్ చాలా వెరైటీ గా ఉంది అన్నారు.. సినిమా మరింత వెరైటీగా ఉంటుందని ఆశిస్తున్నాను.. ఈ సినిమా కి పనిచేసిన అందరికి అల్ ది బెస్ట్.. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మార్చి 19 న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అందరు చూసి ఈ సినిమా సభ్యులను ఆశీర్వదించండని కోరాడు.