Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నాగచైతన్యను రోడ్డుపైకి లాక్కొచ్చిన తమన్నా!
Recommended Video
అగ్ర హీరోయిన్లు ఐటమ్, స్పెషల్ సాంగ్లో నర్తించడం చాలా సాధారణమైంది. గతంలో కాజోల్ తదితరులు స్టెప్పులేసి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. తాజాగా మరోసారి తమన్నా భాటియా సవ్యసాచి చిత్రంలో ఓ ప్రత్యేకమైన పాటకు నాగచైతన్యతో కలిసి స్టెప్పులు వేయబోతున్నారు.
90 దశకంలో టాలీవుడ్ మన్మధుడు నాగార్జున నటించిన అల్లరి అల్లుడు చిత్రంలోని నిన్ను రోడ్డు మీద చూసినది లగ్గాయిత్తు అనే పాటకు తమన్నా డ్యాన్స్ వేయబోతున్నారు.
ఈ పాటను రీమిక్స్ చేసి తొలుత నాగార్జున, నిధి అగర్వాల్పై చిత్రీకరించాలని భావించారు. కానీ తమన్నా అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఆమెను సంప్రదించగా ఒకే చెప్పింది.
ఈ పాట కోసం తమన్నా బిజీ షెడ్యూల్లో మార్పులు చేసుకొని స్టెప్పులేసింది. కొద్ది రోజుల క్రితమే ఈ పాట చిత్రీకరణ పూర్తయింది.
చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటులు మాధవన్, భూమిక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.