Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
నాగచైతన్యను రోడ్డుపైకి లాక్కొచ్చిన తమన్నా!
Recommended Video
అగ్ర హీరోయిన్లు ఐటమ్, స్పెషల్ సాంగ్లో నర్తించడం చాలా సాధారణమైంది. గతంలో కాజోల్ తదితరులు స్టెప్పులేసి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. తాజాగా మరోసారి తమన్నా భాటియా సవ్యసాచి చిత్రంలో ఓ ప్రత్యేకమైన పాటకు నాగచైతన్యతో కలిసి స్టెప్పులు వేయబోతున్నారు.
90 దశకంలో టాలీవుడ్ మన్మధుడు నాగార్జున నటించిన అల్లరి అల్లుడు చిత్రంలోని నిన్ను రోడ్డు మీద చూసినది లగ్గాయిత్తు అనే పాటకు తమన్నా డ్యాన్స్ వేయబోతున్నారు.
ఈ పాటను రీమిక్స్ చేసి తొలుత నాగార్జున, నిధి అగర్వాల్పై చిత్రీకరించాలని భావించారు. కానీ తమన్నా అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఆమెను సంప్రదించగా ఒకే చెప్పింది.
ఈ పాట కోసం తమన్నా బిజీ షెడ్యూల్లో మార్పులు చేసుకొని స్టెప్పులేసింది. కొద్ది రోజుల క్రితమే ఈ పాట చిత్రీకరణ పూర్తయింది.
చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటులు మాధవన్, భూమిక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.