Don't Miss!
- News Astrology: రేపటి నుంచి ఈ రాశులకు అఖండ ధనయోగం
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Technology వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆ పని పూర్తి చేసిన తమన్నా.. ఫినిష్ అంటూ పోస్ట్ పెట్టేసింది
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్పై మెగా పవర్స్టార్ రామ్చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన సినిమా 'సైరా నరసింహా రెడ్డి'. చిరంజీవి, నయనతార హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. తమన్నా, అమితాబ్ బచ్చన్, కుచ్చ సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రలు పోషించారు. అక్టోబర్ 2న భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఇందులో భాగంగా 'సైరా' హిందీ వెర్షన్ కోసమై తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంది తమన్నా. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించిన తమన్నా.. ''ఇప్పుడే 'సైరా' హిందీ వెర్షన్లో నా క్యారెక్టర్ డబ్బింగ్ పూర్తి చేశా. లక్ష్మీ పాత్రలో నటించడం అద్భుతమైన అనుభవం'' అని పేర్కొంది. గతంలో కూడా ఊపిరి, ఎఫ్ 2 సినిమాల్లో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంది తమన్నా.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన 'సైరా నరసింహా రెడ్డి' చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. చిరంజీవి కెరీర్ లో రాబోతున్న తొలి చారిత్రాత్మక చిత్రం కావడంతో ఈ సినిమాపై ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి.