Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఆ పని పూర్తి చేసిన తమన్నా.. ఫినిష్ అంటూ పోస్ట్ పెట్టేసింది
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్పై మెగా పవర్స్టార్ రామ్చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన సినిమా 'సైరా నరసింహా రెడ్డి'. చిరంజీవి, నయనతార హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. తమన్నా, అమితాబ్ బచ్చన్, కుచ్చ సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రలు పోషించారు. అక్టోబర్ 2న భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఇందులో భాగంగా 'సైరా' హిందీ వెర్షన్ కోసమై తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంది తమన్నా. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించిన తమన్నా.. ''ఇప్పుడే 'సైరా' హిందీ వెర్షన్లో నా క్యారెక్టర్ డబ్బింగ్ పూర్తి చేశా. లక్ష్మీ పాత్రలో నటించడం అద్భుతమైన అనుభవం'' అని పేర్కొంది. గతంలో కూడా ఊపిరి, ఎఫ్ 2 సినిమాల్లో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంది తమన్నా.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన 'సైరా నరసింహా రెడ్డి' చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. చిరంజీవి కెరీర్ లో రాబోతున్న తొలి చారిత్రాత్మక చిత్రం కావడంతో ఈ సినిమాపై ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి.