Don't Miss!
- News కేశినేని నాని Vs చిన్ని వార్ లో షర్మిల కొత్త ట్విస్ట్..!!
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
విజయ్ దేవరకొండకు తమిళ నిర్మాత క్షమాపణ.. అసలేం జరిగిందంటే..
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండకు తమిళ నిర్మాత క్షమాపణలు చెప్పారు. ఓ సినిమా ప్రాజెక్టు విషయంలో తప్పుడు ప్రచారం జరిగిన నేపథ్యంలో తమిళ నిర్మాణ సంస్థ డస్కీ ఎంటర్టైన్మెంట్స్ తరఫఉన నిర్మాత బాలా సెంథిల్ కుమార్ వివాదంపై క్లారిటీ ఇచ్చారు. విజయ్ దేవరకొండ సినిమా విషయంలో చోటుచేసుకొన్న రూమర్ల విషయంలో మాకు సంబంధం లేకుండానే ప్రచారం అయ్యాయని పేర్కొన్నారు.
తమిళ సినిమాకు సంబంధించిన వివాదంలోకి వెళితే.. తమిళ రంగానికి చెందిన డస్కీ ఎంటర్టైన్మెంట్కు చెందిన క్రియేటివ్ ప్రొడ్యూసర్ బాల సెంథిల్ కుమార్ ఇటీవల విజయ్ దేవరకొండను ఓ ప్రాజెక్టు కోసం సంప్రదించారు. అయితే సెంథిల్ ప్రతిపాదనను విజయ్ దేవరకొండ సున్నితంగా తిరస్కరించారు. అయితే కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగా ఆ ప్రాజెక్టును విజయ్ దేవరకొండ చేస్తున్నారని చెప్పి పలువురు తమిళ హీరోయిన్లతో చర్చలు జరిపినట్టు తమిళ మీడియాలో ప్రచారం జరిగింది. దాంతో విజయ్ దేవరకొండ టీమ్ ఆ విషయంపై నిర్మాతను ఆరా తీసింది. ఆ వార్త వెనుక కారణాలు అడిగి తెలుసుకొన్నారు. అయితే ఆ వార్త మీడియాలో రావడానికి తమకు సంబంధం ఏమీ లేదని స్పష్టం చేశారు.
తమ తరఫున తప్పు జరిగినందున్న డస్కీ ఎంటర్టైన్మెంట్స్ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఓ ప్రాజెక్టు విషయంలో ఫార్మల్గా విజయ దేవరకొండను మా క్యాస్టింగ్ ఏజెన్సీ ద్వారా సంప్రదించాం. ఆ తర్వాత మా ప్రాజెక్టు గురించి ఆయన ఇంట్రెస్ట్గా లేరని తెలిసింది. అంతవరకు మాత్రమే ఆయన టీమ్తో చర్చలు జరిగాయి. అయితే వారితో జరిగిన చర్చలు, ప్రాజెక్టు విషయంలో తప్పుగా మీడియాలో వార్తలు వచ్చాయి. అందుకు మేము చింతిస్తున్నాం అని ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ వ్యవహారంలో జరిగిన విషయాల పట్ల చింతిస్తున్నాం అని తెలిపారు.
ఈ క్రమంలో విజయ్ దేవరకొండ టీమ్కు చెందిన అనురాగ్ పర్వతనేని స్పందించి ఓ ప్రకటనను విడుదల చేయమని కోరగా, అధికారికంగా డస్కీ ఎంటర్టైన్మెంట్ నోటును విడుదల చేసింది. దాంతో ఈ వివాదం సద్దుమణిగేలా చేశారు.
ఇదిలా ఉండగా, విజయ్ దేవరకొండకు తమ డస్కీ ఎంటర్టైన్మెంట్కు జరిగిన వివరాలను తప్పుగా ప్రచారం చేయడంపై స్థానికంగా పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.