Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మాస్టర్ అభిమానులకు గుడ్ న్యూస్.. 100% హౌజ్ ఫుల్!
తమిళనాడు ప్రభుత్వం థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీని ఆమోదించింది. నవంబర్ 10 నుండి తమిళనాడు అంతటా థియేటర్లు తిరిగి తెరవబడ్డాయి, అయితే మొన్నటి వరకు 50 శాతం సీటింగ్ సామర్థ్యం వరకే అనుమతులు ఇచ్చారు. కానీ పెద్ద సినిమలేవి కూడా రిలీజ్ కాలేదు. థియేటర్స్ యాజమాన్యాలపై ఆ ఎఫెక్ట్ గట్టిగానే పడింది.
భారీ స్థాయిలో నష్టాలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో థియేటర్స్ యాజమాన్యం ఇటీవల తమిళ ప్రభుత్వాన్ని కలుసుకుని, సీటింగ్ సామర్థ్యాన్ని పెంచాలనే అభ్యర్థనను ప్రభుత్వం ముందు పెట్టింది. అయినప్పటికీ టిఎన్ ప్రభుత్వం తొందరపడలేదు. ఆరోగ్య శాఖను సంప్రదించిన అనంతరం కోవిడ్ -19 యొక్క రోజువారీ కేసులు తగ్గినట్లు నివేదిక వచ్చిన తరువాతే అనుమతులు ఇవ్వడం జరిగింది.
సీటింగ్ సామర్థ్యాన్ని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించడంతో.. రాష్ట్రంలోని అన్ని థియేటర్లు మల్టీప్లెక్స్లలో 100 శాతం ప్రేక్షకులను అనుమతించగలవని క్లారిటీ వచ్చేసింది. అయితే ముందు జాగ్రత్త చర్యల కోసం కొన్ని విషయాల్లో యాజమాన్యం జాగ్రత్తగా ఉండాలని వివరణ ఇచ్చింది. ఇక విజయ్ మాస్టర్ సినిమా ఈ పొంగల్ కు రాబోతున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా యూనిట్ కూడా ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా కలిసి 100 శాతం ప్రేక్షకులను అనుమతించాలని ముందే కోరింది. ఆ డిసిషన్ గురించి తెలుసుకున్న తరువాతే విజయ్ మాస్టర్ రిలీజ్ ఎనౌన్స్మెంట్ ఇచ్చినట్లు టాక్ అయితే వస్తోంది.