Don't Miss!
- News ఉండి టీడీపీలో వార్ - మారుతున్న లెక్కలు, ఆడియో వైరల్..!!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘మిస్ ఇండియా’గా మారిన కీర్తి సురేష్, అంచనాలు పెంచిన టీజర్
'మహానటి' చిత్రానికిగాను జాతీయ ఉత్తమ నటిగా ఎంపికైన కీర్తి సురేష్ మరో బలమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నరేంద్రనాథ్ దర్శకత్వంలో రూపొందే ఈ మూవీ ఆమె కెరీర్లో 20వ చిత్రం. దీనికి 'మిస్ ఇండియా' అనే టైటిల్ ఖరారు చేస్తూ చిత్ర బృందం టీజర్ విడుదల చేశారు.
టీజర్ ఆసక్తికరంగా డిజైన్ చేశారు. జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేష్ 2019లో 'మిస్ ఇండియా'గా మీ ముందుకు రాబోతోందని వెల్లడిస్తూ ఇందులో ఆమెను మరింత అందంగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు. టీజర్ చూస్తుంటే ఇండియాతో పాటు విదేశాల్లో షూటింగ్ జరిపినట్లు స్పష్టమవుతోంది.
'మిస్ ఇండియా' షూటింగ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం అయింది. ఇండియాలో కొంత చిత్రీకరణ పూర్తయిన తర్వాత షూటింగ్ యూరఫ్కు షిప్ట్ అయింది. సినిమా కథ మొత్తం కీర్తి సురేష్ పోషించే పాత్ర చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది.
'మహానటి' తర్వాత కీర్తి సురేష్ మహిళా ప్రధానమైన, బలమైన పాత్రలు చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. 'మిస్ ఇండియా' మూవీలో నరేష్, నదియా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కమల్ కామరాజు, భానుశ్రీ... కీర్తి సురేష్ తోబుట్టువులుగా, రాజేంద్రప్రసాద్ తాతయ్య పాత్రలో కనిపించబోతున్నారు. ఈస్ట్ కోస్ట్ ఫిల్మ్స్ బేనర్లో మహేష్ ఎస్ కోనేరు నిర్మిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు.