Don't Miss!
- Sports ప్రశాంతంగా ఉన్నా.. ఇక చాలు- నరైన్ షాకింగ్ కామెంట్స్
- News హనుమాన్ జయంతి నాడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ జోరు; జనసేన ట్రెండింగ్ వీడియో!!
- Technology Android 15 Features ఆండ్రాయిడ్ 15 లో క్వారంటైన్ ఫీచర్.. ఎలా పనిచేస్తుంది.. ఏంటి ఉపయోగం..??
- Finance Amit Shah: ఆ కంపెనీల్లో అమిత్ షా పెట్టుబడులు.. హోం మంత్రి పోర్ట్ఫోలియోలో టాప్-10 స్టాక్స్ ఇవే
- Lifestyle వీర్య కణాల సంఖ్య ఫాస్ట్గా పెరగాలంటే ఇవి వెంటనే తినండి..!
- Automobiles మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
‘మిస్ ఇండియా’గా మారిన కీర్తి సురేష్, అంచనాలు పెంచిన టీజర్
'మహానటి' చిత్రానికిగాను జాతీయ ఉత్తమ నటిగా ఎంపికైన కీర్తి సురేష్ మరో బలమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నరేంద్రనాథ్ దర్శకత్వంలో రూపొందే ఈ మూవీ ఆమె కెరీర్లో 20వ చిత్రం. దీనికి 'మిస్ ఇండియా' అనే టైటిల్ ఖరారు చేస్తూ చిత్ర బృందం టీజర్ విడుదల చేశారు.
టీజర్ ఆసక్తికరంగా డిజైన్ చేశారు. జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేష్ 2019లో 'మిస్ ఇండియా'గా మీ ముందుకు రాబోతోందని వెల్లడిస్తూ ఇందులో ఆమెను మరింత అందంగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు. టీజర్ చూస్తుంటే ఇండియాతో పాటు విదేశాల్లో షూటింగ్ జరిపినట్లు స్పష్టమవుతోంది.
'మిస్ ఇండియా' షూటింగ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం అయింది. ఇండియాలో కొంత చిత్రీకరణ పూర్తయిన తర్వాత షూటింగ్ యూరఫ్కు షిప్ట్ అయింది. సినిమా కథ మొత్తం కీర్తి సురేష్ పోషించే పాత్ర చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది.
'మహానటి' తర్వాత కీర్తి సురేష్ మహిళా ప్రధానమైన, బలమైన పాత్రలు చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. 'మిస్ ఇండియా' మూవీలో నరేష్, నదియా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కమల్ కామరాజు, భానుశ్రీ... కీర్తి సురేష్ తోబుట్టువులుగా, రాజేంద్రప్రసాద్ తాతయ్య పాత్రలో కనిపించబోతున్నారు. ఈస్ట్ కోస్ట్ ఫిల్మ్స్ బేనర్లో మహేష్ ఎస్ కోనేరు నిర్మిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు.