Don't Miss!
- Sports సూపర్ సండే: సునామీ సన్రైజర్స్ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- News గంటాకు సీటు ఖరారు - టీడీపీ తుది జాబితా విడుదల, లిస్టులో..!!
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
‘మిస్ ఇండియా’గా మారిన కీర్తి సురేష్, అంచనాలు పెంచిన టీజర్
'మహానటి' చిత్రానికిగాను జాతీయ ఉత్తమ నటిగా ఎంపికైన కీర్తి సురేష్ మరో బలమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నరేంద్రనాథ్ దర్శకత్వంలో రూపొందే ఈ మూవీ ఆమె కెరీర్లో 20వ చిత్రం. దీనికి 'మిస్ ఇండియా' అనే టైటిల్ ఖరారు చేస్తూ చిత్ర బృందం టీజర్ విడుదల చేశారు.
టీజర్ ఆసక్తికరంగా డిజైన్ చేశారు. జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేష్ 2019లో 'మిస్ ఇండియా'గా మీ ముందుకు రాబోతోందని వెల్లడిస్తూ ఇందులో ఆమెను మరింత అందంగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు. టీజర్ చూస్తుంటే ఇండియాతో పాటు విదేశాల్లో షూటింగ్ జరిపినట్లు స్పష్టమవుతోంది.
'మిస్ ఇండియా' షూటింగ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం అయింది. ఇండియాలో కొంత చిత్రీకరణ పూర్తయిన తర్వాత షూటింగ్ యూరఫ్కు షిప్ట్ అయింది. సినిమా కథ మొత్తం కీర్తి సురేష్ పోషించే పాత్ర చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది.
'మహానటి' తర్వాత కీర్తి సురేష్ మహిళా ప్రధానమైన, బలమైన పాత్రలు చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. 'మిస్ ఇండియా' మూవీలో నరేష్, నదియా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కమల్ కామరాజు, భానుశ్రీ... కీర్తి సురేష్ తోబుట్టువులుగా, రాజేంద్రప్రసాద్ తాతయ్య పాత్రలో కనిపించబోతున్నారు. ఈస్ట్ కోస్ట్ ఫిల్మ్స్ బేనర్లో మహేష్ ఎస్ కోనేరు నిర్మిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు.