Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
‘మిస్ ఇండియా’గా మారిన కీర్తి సురేష్, అంచనాలు పెంచిన టీజర్
'మహానటి' చిత్రానికిగాను జాతీయ ఉత్తమ నటిగా ఎంపికైన కీర్తి సురేష్ మరో బలమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నరేంద్రనాథ్ దర్శకత్వంలో రూపొందే ఈ మూవీ ఆమె కెరీర్లో 20వ చిత్రం. దీనికి 'మిస్ ఇండియా' అనే టైటిల్ ఖరారు చేస్తూ చిత్ర బృందం టీజర్ విడుదల చేశారు.
టీజర్ ఆసక్తికరంగా డిజైన్ చేశారు. జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేష్ 2019లో 'మిస్ ఇండియా'గా మీ ముందుకు రాబోతోందని వెల్లడిస్తూ ఇందులో ఆమెను మరింత అందంగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు. టీజర్ చూస్తుంటే ఇండియాతో పాటు విదేశాల్లో షూటింగ్ జరిపినట్లు స్పష్టమవుతోంది.
'మిస్ ఇండియా' షూటింగ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం అయింది. ఇండియాలో కొంత చిత్రీకరణ పూర్తయిన తర్వాత షూటింగ్ యూరఫ్కు షిప్ట్ అయింది. సినిమా కథ మొత్తం కీర్తి సురేష్ పోషించే పాత్ర చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది.
'మహానటి' తర్వాత కీర్తి సురేష్ మహిళా ప్రధానమైన, బలమైన పాత్రలు చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. 'మిస్ ఇండియా' మూవీలో నరేష్, నదియా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కమల్ కామరాజు, భానుశ్రీ... కీర్తి సురేష్ తోబుట్టువులుగా, రాజేంద్రప్రసాద్ తాతయ్య పాత్రలో కనిపించబోతున్నారు. ఈస్ట్ కోస్ట్ ఫిల్మ్స్ బేనర్లో మహేష్ ఎస్ కోనేరు నిర్మిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు.