Don't Miss!
- News కాంగ్రెస్ ఒకేఒక్క అజెండా అదే; కుత్సితమైన చిల్లర రాజకీయం: భగ్గుమన్న కేటీఆర్
- Lifestyle Gruha Pravesham Wishe in Telugu : గృహప్రవేశం శుభాకాంక్షలను ఇలా తెలపండి..
- Finance Success Story: పుట్టింది చిన్న టైలర్ కొడుకుగా.. ప్రస్తుతం బిలియనీర్.. ఇదిరా సక్సెస్ అంటే..
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. లాంచ్, స్పెసిఫికేషన్ల పూర్తి వివరాలు..!!
- Sports ధోనీని ఒప్పించడం కష్టమే..ఆ ఫేక్ న్యూస్ నమ్మొద్దు- రోహిత్
- Automobiles జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
వర్మ మేథావి అని అందరూ అలాగే అంటే ఎట్లా? ఎన్టీఆర్ మాత్రమే గ్రేట్..: తేజ ఆసక్తికర వ్యాఖ్యలు
ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి డైరెక్టర్ తేజ. సినిమాల్లో అయినా.. నిజ జీవితంలో అయినా స్టేట్ ఫార్వార్డ్గా చెప్పాలనుకున్నది చెప్పేయడం ఆయన నైజం. ప్రస్తుతం పాలిటిక్స్ వేడి రాజుకుంటుండటంతో ఆయన గతంలో రాజకీయ నాయకుల గురించి ముక్కుసూటిగా మాట్లాడిన కొన్ని వీడియోలు ట్రెండింగ్ అవుతున్నాయి. ఓ సందర్భంలో కులం పిచ్చి ఉన్నవాడు తన దృష్టిలో మనిషే కాదు అని తేజ అన్న మాటలు ఇప్పుడు హైలైట్ అవుతున్నాయి. విషయంలోకి వస్తే..
గతంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న డైరెక్టర్ తేజ.. కులపిచ్చోళ్లకు చురకలు అంటించారు. కులంపైన, పేరు చివర ఇంటి పేరు తగిలించుకోవడంపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు తేజ. ఈ మేరకు ఎన్టీఆర్, చిరంజీవి, వైఎస్ జగన్, చంద్రబాబు, కేసీఆర్ లాంటి బడా రాజకీయ ప్రముఖులను ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ''రామ్ గోపాల్ వర్మ మేథావి కదా అని ఆయన పేరుతో ఉన్న వాడినల్లా గొప్పోడు అంటే నేను ఎలా? రామారావుగారు ఉన్నారు.. ఆయన కులంలో ఆయన గొప్పోడు.. అంతేకాని ఆ కులంలో ఉన్న వాళ్లంతా గొప్పోళ్లు అంటే కష్టం కదా? ఆయన సీఎం అయ్యాడు కాబట్టి ఆ కులంలో మేము కూడా గ్రేట్ అంటే సవ్యం కాదు కదా! అక్కడ ఎన్టీఆర్ మాత్రమే గ్రేట్.. నువ్ కాదు'' అంటూ కుల పిచ్చోళ్లకు తనదైన కోణంలో చురకలు పెట్టారు తేజ. అయితే మళ్లీ ఇప్పుడు కుల రాజకీయాల ప్రస్తావనలు పెరుగుతుండటంతో తేజ మాట్లాడిన ఆ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.
కాగా మే 24న సీత సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తేజకు ఈ వీడియోలు మంచి ప్రమోషన్గా మారడం విశేషం. ఎందుకంటే ఈ చిత్రంలో కాజల్ది కూడా ముక్కుసూటిగా మాట్లాడే క్యారెక్టరే కదా. తేజ దర్శకత్వంలో ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సీత రూపుదిద్దుకుంది. చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మన్నారా చోప్రా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు, సోను సూద్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సెన్సార్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఓ రేంజ్ అంచనాల నడుమ మే 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.