Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
గత ఇరవై ఏళ్లలో కాలా, సైరా.. ప్రతీ ఒక్క భారతీయుడు చూడాల్సిన చిత్రం.. గవర్నర్ ప్రశంసలు
మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్తో దూసుకుపోతున్న ఈ మూవీ ఇప్పటికే వందకోట్లను దాటేసి.. రెండు వంద కోట్ల వైపు పరిగెడుతోంది.
తొలి స్వతంత్ర్య సమరయోధుడు, రేనాటి వీరుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కిన సైరా మూవీని ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేశారు. దాదాపు 300కోట్ల బడ్జెట్తో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. అక్టోబర్ 2న విడుదలైన ఈ మూవీ.. తెలుగు నాట వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది.
అయితే ఇంతటి ఘన విజయం సాధించిన ఈ మూవీని చూడాలంటూ గవర్నర్ తమిళిపై సౌందరరాజన్ను మెగాస్టార్ చిరంజీవి కోరిన సంగతి తెలిసిందే. అయితే నేడు గవర్నర్ తమ కుటుంబ సభ్యులందరితో కలిసి సినిమా చూశారు. ఈ చిత్రం తనకెంతో నచ్చిందని, చిరంజీవి నటన, క్యాస్టూమ్స్, విజువల్స్ అన్నీ బాగున్నాయని, మాటల్లో చెప్పలేమంటూ.. నా బ్రదర్ చిరంజీవి.. చిరంజీవిగా ఉండాలంటూ చిత్ర యూనిట్ మొత్తాన్ని ప్రశంసించారు.
ఈ మేరకు సోషల్ మీడియాలో స్పందిస్తూ.. 'గత ఇరవై ఏళ్లలో నేను చూసింది రెండు సినిమాలే... అవి కాలా, సైరా. భారత దేశ స్వాతంత్ర్య పోరాటంలో దక్షిణ భారతదేశ పాత్ర ఎలాంటిదో సైరా నిరూపించింది. తన వెంటే నమ్మిన బంటులా ఉండే రాజా పాండీ క్యారెక్టర్తో తెలుగు, తమిళుల మధ్య ఉన్న సోదర భావం ఎలాంటిదో మరోసారి చూపించారు. ప్రతీ ఒక్క భారతీయుడు తప్పక చూడాల్సిన చిత్రమిది. ఈ సినిమాను ఇంత అద్భుతంగా బయటకు తీసుకొచ్చేందుకు చిరంజీవి పడిన కష్టాన్ని తప్పక అభినందించాలి' అంటూ ట్వీట్ చేసింది.
Telangana Governor Shri @DrTamilisaiGuv watched Megastar Chiranjeevi's #SyeRaaNarasimhaReddy in an exclusive premiere with her family. It was a pleasure to know that she liked the film. She appreciated the whole team for making a great film. pic.twitter.com/KBUxrNLWsp
— Konidela Pro Company (@KonidelaPro) October 9, 2019
ఏడో రోజూ సైరా అప్రతిహతంగా దూసుకుపోతోంది. గోసాయి వెంకన్నగా అమితాబ్, అవుకు రాజుగా కిచ్చా సుదీప్, వీరా రెడ్డిగా జగపతి బాబు, లక్ష్మీగా తమన్నా పాత్రలకు మంచి ప్రశంసలు లభించాయి. ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందించగా.. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు.