Don't Miss!
- Sports టీ20 వరల్డ్ కప్లో ధోనీ రీఎంట్రీ: బీసీసీఐ మాస్టర్ ప్లాన్!
- Lifestyle తీర్చుకోలేని రుణం అమ్మ ప్రేమ..! మన పుట్టినరోజున అందరికంటే ఎక్కువ సంతోషపడేది అమ్మ..!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
టీజర్: పిట్ట కథలుగా మారిన తెలుగు 'లస్ట్ స్టోరీస్'.. రిలీజ్ ఎప్పుడంటే?
గత కొంత కాలంగా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో భాగం అయినవారికీ మాత్రం మంచి క్రేజ్ దక్కుతోంది. ఇక తెలుగులో రావాల్సిన లస్ట్ స్టోరీస్ కోసం కూడా ఓ వర్గం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ఇంటర్నేషనల్ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఆ కథను తెలుగులోకి తెస్తోంది. పిట్టకథ టైటిల్ తో తెలుగులో రిలీజ్ చేయబోతున్న ఆ వెబ్ సిరీస్ టీజర్ ను కూడా విడుదల చేయగా సోషల్ మీడియాలో అది వైరల్ అవుతోంది.
తెలుగు ఆడియెన్స్ ను టార్గెట్ చేసిన నెట్ ఫ్లిక్స్
ఈ లాక్ డౌన్ లో నెట్ ఫ్లిక్స్ అంటే ఏంటో తెలియని వారు కూడా ఎకౌంట్ యక్టివేట్ చేసుకొని 18+ కథలపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఏ మాత్రం బోల్డ్ కంటెంట్ ఉన్నా కూడా ఆ వెబ్ సిరీస్ లకు మంచి క్రేజ్ దక్కుతోంది. ఈ లాక్ డౌన్ లో ఎక్కువమంది అడల్ట్ కంటెంట్ వైపే లుక్కేశారట. ఇక ఓ వైపు ఆహా తెలుగులో తన స్థాయిని పెంచుకోవాలని ట్రై చేస్తుంటే మొదటిసారి నెట్ ఫ్లిక్స్ ఫొటో ఇవ్వడబికి రెడీ అయ్యింది.
పిట్టకథలుగా మారిన లస్ట్ స్టొరీస్
నేటి ఫ్లిక్స్ లో అత్యధిక మంది చూసిన వెబ్ సిరీస్ లలో లస్ట్ స్టోరీస్ ఒకటి. నాలుగు భాగాలుగా రూపొందించిన ఈ సిరీస్ లలో నాలుగురు బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ బోల్డ్ పాత్రల్లో నటించగా కరణ్ జోహార్, అనురాగ్ కశ్యప్ వంటి వారు సిరీస్ లను డైరెక్ట్ చేశారు. ముఖ్యంగా రాధికా ఆప్టే, కీయరా చేసిన పాత్రలకు మంచి క్రేజ్ దక్కింది. ఇక అదే తరహాలో తెలుగులో పిట్టకథలు అనే టైటిల్ తో రీమేక్ చేశారు.
Recommended Video
టీజర్ వైరల్
నాగ్ అశ్విన్ సంకల్ప్ రెడ్డి, నందిని రెడ్డి, తరుణ్ భాస్కర్ వంటి వారు డైరెక్ట్ చేసిన పిట్ట కథ వెబ్ యొక్క టీజర్ ను రిలీజ్ చేశారు. అందులో బోల్డ్ ఉమెన్స్ గా మంచు లక్ష్మి, శ్రుతి హాసన్, అమలా పాల్, ఈషా రెబ్బ నఠించారు. టీజర్ ను చూస్తుంటే హిందీ వెబ్ కంటెంట్ కంటే కాస్త డిఫరెంట్ గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 19న ఈ సిరీస్ ప్రసారం కానున్నట్లు సమాచారం.
ఈషా రెబ్బ పాత్రపైనే అందరి ఫోకస్
లస్ట్ స్టోరీస్ లలో ఎవరి పాత్ర ఎలా ఉన్నా కూడా అందరు ఎక్కువగా ఎదురుచూస్తున్నది మాత్రం ఈషా రెబ్బ పాత్ర కోసమే. హిందీలో కీయరా అద్వానీ చేసిన ఒక బోల్డ్ పాత్రను అమ్మడు తెలుగులో చేసింది. బెడ్ సీన్ లో ఎలా నటించి ఉంటుంది అనే ఆలోచన అందరిలో ఆసక్తిని రేపుతోంది. అలాగే ఈ బేబి సిరీస్ తోనే ఈషా మంచి క్రేజ్ అందుకోవాలని అనుకుంటోంది. చూడాలి మరి ఏమవుతుందో..