Don't Miss!
- News లేడీ స్కూట్ టీచర్ ను ఎత్తుకెళ్లిన యువకుడు, జాతరకు వెళ్లిన టైమ్ లో ప్లాన్ చేసి, అంతేనా!
- Lifestyle చాణక్య నీతి : పొరపాటున కూడ భార్యకు ఈ 5 విషయాలు అస్సలు చెప్పకూడదు..!
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మహేశ్ - త్రివిక్రమ్ మూవీ నుంచి క్రేజీ అప్డేట్: ఐదు కంప్లీట్.. మూడింటికి రైట్
కొంత కాలంగా వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతున్నాడు టాలీవుడ్ బడా హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ జోష్లోనే ఇప్పుడు వరుసగా ప్రాజెక్టులను లైన్లో పెట్టుకుంటున్నాడు. ఇప్పటికే పరశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే సినిమాను చేస్తోన్న అతడు.. ఇది పట్టాలపై ఉండగానే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఓ సినిమాను ప్రకటించాడు. ఇది అతి త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్టు గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో విపరీతంగా వైరల్ అయిపోతోంది.
మహేశ్ బాబుతో చేయబోయే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్తో త్రివిక్రమ్ శ్రీనివాస్ బిజీగా ఉన్నాడట. ప్రస్తుతం ఈ స్క్రిప్టుకు తగ్గట్లుగా అదిరిపోయే డైలాగులను సానబడుతున్నాడని తెలుస్తోంది. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రానికి సంగీతం అందిస్తోన్న ఎస్ థమన్.. ఇప్పటికే దీని కోసం ఐదు ట్యూన్స్ను కంపోజ్ చేసి పెట్టేశాడట. తాజాగా వీటిని చిత్ర యూనిట్కు వినిపించగా.. అందులో మూడింటికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇవన్నీ అదిరిపోయేలా వచ్చాయని.. త్వరలోనే ఈ ట్యూన్స్కు సంబంధించిన రికార్డింగ్ను కూడా మొదలు పెడతారనే టాక్ వినిపిస్తోంది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ సెప్టెంబర్ చివరి వారం లేదా అక్టోబర్ మొదటి వారం నుంచి ప్రారంభం కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో మహేశ్ బాబు రా ఏజెంట్గా కనిపిస్తాడని అంటున్నారు. అలాగే, అతడి లుక్ కూడా సరికొత్తగా ఉండబోతుందట. ఇందులో సూపర్ స్టార్ సరసన ఎవరు నటిస్తారన్న దానిపై క్లారిటీ లేదు. ఈ చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇక, ఈ సినిమాకు 'పార్థు', 'అతడే పార్థు' అనే టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది.