The wedding of Virosh: విజయ్‌ దేవరకొండ- రష్మిక పెళ్లి... యంగ్ హీరోయిన్‌తో జంటగా ఆ స్టార్ డైరెక్టర్

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ- నేషనల్ క్రష్ రష్మిక మందన్నల వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఫిబ్రవరి 26వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే. ఇన్ని రోజులూ తమ బంధాన్ని గుట్టుగా ఉంచిన ఈ జంట.. ఇటీవల అధికారికంగా తమ బంధాన్ని, పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని బయటపెట్టారు. ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్ పేరిట తమ పెళ్లి సెలబ్రేషన్స్ జరగబోతున్నాయని.. ఇన్నేళ్లుగా తమను ఆదరించి, అభిమానిస్తున్న అభిమానులకు విజయ్ - రష్మికలు ధన్యవాదాలు తెలియజేశారు. దాంతో ఇంతకాలంగా జరుగుతోన్న సస్పెన్స్‌కి వీరిద్దరూ తెరదించారు.

ఉదయ్‌పూర్‌లో పెళ్లి నిమిత్తం విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నలు బయల్దేరి వెళ్లారు. వీరితో పాటు రెండు కుటుంబాలు, సన్నిహితులు, బంధువులు కూడా ఉదయ్‌పూర్ చేరుకున్నారు. నగరంలోని ఆరావళి పర్వతాల మధ్య ఉన్న అందమైన ది మెమొంటోస్ బై ఐటీసీ హోటల్స్‌ అనే లగ్జరీ హోటల్‌లో విజయ్ - రష్మికలు ఒక్కటి కానున్నారు. మంగళవారం నుంచి వీరి పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 24వ తేదీన అంగరంగ వైభవంగా సంగీత్ వేడుకలు జరిగినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మిగిలిన ఈవెంట్స్ కోసం కూడా భారీగా ఏర్పాట్లు చేశారు విజయ్ - రష్మిక. బుధవారం ఉదయం హల్దీ, సాయంత్రం మెహందీ ఫంక్షన్ నిర్వహించనున్నారు. అలాగే గురువారం రష్మిక మెడలో మూడు ముళ్లు వేయనున్నారు విజయ్.

Tharun Bhascker and Eesha Rebba to Attend Vijay Deverakonda Rashmika Wedding Spark Relationship Buzz

మరోవైపు.. విజయ్ దేవరకొండ - రష్మికల పెళ్లి వేడుకల్లో పాల్గొనేందుకు సెలబ్రిటీలు ఉదయ్‌పూర్‌ నగరానికి చేరుకుంటున్నారు. ప్రముఖుల రాకతో ఉదయ్‌పూర్ విమానాశ్రయం సందడిగా మారింది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన ప్రముఖులతో పాటు ఆసియా కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబం కూడా విజయ్ - రష్మికల పెళ్లిలో పాల్గొనబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఉదయ్‌పూర్ విమానాశ్రయంలో ముఖేష్ అంబానీ, నీతా అంబానీతో పాటు ఆకాష్, శ్లోకా అంబానీలు కనిపించిన వీడియోలు వైరల్ కావడంతో ఈ వార్తలకు బలం చేకూరినట్లయ్యింది. అయితే తర్వాత ఇదంతా నిజం కాదని జాతీయ మీడియా తేల్చింది. రాజస్థాన్‌లోని ప్రసిద్ధ క్షేత్రం.. నాథ్‌ద్వారాలో ఉన్న శ్రీనాథ్‌జీ ఆలయాన్ని దర్శించుకోవడానికి ముఖేష్ అంబానీ కుటుంబం రాజస్థాన్‌ చేరుకున్నట్లుగా తెలుస్తోంది.

ఇదిలాఉండగా.. విజయ్ దేవరకొండ- రష్మికల పెళ్లికి టాలీవుడ్ నుంచి ఓ జంట హాజరుకానుండటం ఆసక్తిని కలిగిస్తోంది. వారు ఎవరో కాదు.. దర్శకుడు తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఈషా రెబ్బా. వీరిద్దరూ ఉదయ్‌పూర్‌కు వెళ్లేముందు శంషాబాద్ విమానాశ్రయంలో సందడి చేసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తరుణ్ భాస్కర్ - ఈషా రెబ్బాలు సీక్రెట్‌గా ప్రేమాయణం సాగిస్తున్నారని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటకు రావడం ఈ కథనాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. దీని గురించి మీడియా ప్రశ్నించగా ఇద్దరూ నవ్వేశారు. తరుణ్ - ఈషా రెబ్బాలు ఇటీవల ఓం శాంతి శాంతి శాంతి సినిమాలో కలిసి జంటగా నటిస్తున్నారు. అలాంటిది ఇప్పుడు జంటగా విజయ్ - రష్మికల పెళ్లికి వెళ్తుండటంతో చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.

అయితే తరుణ్ భాస్కర్- ఈషా రెబ్బాలతో విజయ్‌ దేవరకొండకి ప్రత్యేక అనుబంధం ఉంది. తనకు పెళ్లిచూపులు వంటి హిట్ అందించి కెకీర్‌లో నిలబడేలా చేశాడని తరుణ్‌పై పలుమార్లు అభిమానాన్ని చాటుకున్నారు విజయ్ దేవరకొండ. ఇక ఈషా రెబ్బా విషయానికి వస్తే.. విజయ్- ఈషాలు తమ కెరీర్ తొలిరోజుల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ మూవీలో కలిసి నటించారు. నాటి నుంచి వీరిద్దరి మధ్య స్నేహం కొనసాగుతోంది. అలా వీరిద్దరినీ తన వివాహానికి ఆహ్వానించాడు విజయ్. ఈ పెళ్లి తర్వాత తరుణ్ భాస్కర్ - ఈషా రెబ్బాలు కూడా గుడ్ న్యూస్ చెబుతారేమో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X