Don't Miss!
- News పార్టీ మార్పుపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఏమన్నారంటే?
- Sports Navjot Singh Sidhu: సచిన్ కాదు.. టీమిండియా అత్యుత్తమ బ్యాటర్ అతనే!
- Lifestyle శ్రీ కృష్ణుడు గోపికలతో మొదలై హోలీ పండగ గురించి ఆసక్తికరమైన విషయాలు.!
- Automobiles ఆటోమేటిక్ గేర్ vs మాన్యువల్ ట్రాన్స్మిషన్.. వీటిలో ఏది బెస్ట్.?.. మనోళ్లు ఎక్కువగా వీటినే కొంటున్నారు.!!
- Technology సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హై రిస్క్ అలెర్ట్.. ఈ ఫోన్లలో భద్రతా లోపాలు.. అప్డేట్ చేయకుంటే..??
- Travel దేశంలో ఒక్కోచోట ఒక్కోలా రంగుల హోలీ జరుపుతారని మీకు తెలుసా?!
- Finance Market Crash: సెన్సెక్స్-నిఫ్టీ నేల చూపులు.. నిండా ముంచిన ఐటీ స్టాక్స్..
మన్మథుడు 2 సెట్స్పై రకుల్ రచ్చ! నాగ్, రాహుల్ కలిసి దాచేయాల్సిన పరిస్థితి
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న మన్మథుడు 2 సినిమాలో సీనియర్ హీరో నాగార్జునతో యంగ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తెగ రొమాన్స్ చేసిందట. కుర్ర హీరోలను పక్కన బెట్టి సీనియర్ హీరో నాగార్జున చెంత చేరిన ఈ అమ్మడు ఆకాశమే హద్దుగా రెచ్చిపోయిందట. మన్మథుడు పేరుకు తగ్గట్టుగా ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ ఓ రేంజ్ లో ఉండేలా చేసుకున్నారట రాహుల్, నాగార్జున. అయితే ఈ సీన్స్ షూటింగ్ చేస్తుండగా సెట్స్ పై అల్లుకుపోయిన తీరు వారిరువురికి ఆశ్చర్య పర్చిందట. దీంతో రకుల్ స్పీడ్ ని క్యాచ్ చేసుకొని ఎలాగైనా సినిమాపై హైప్ తీసుకురావాలని మొన్నటి టీజర్ లో రకుల్ని కనిపించకుండా దాచేశారట.
'సాహూ' టీజర్ కి పోటీగా ఈ రోజే దిగిన 'మన్మథుడు 2' టీజర్ ఊహించిన దాన్ని మించిన రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ టీజర్ చూసి రాజమౌళి సైతం ఫిదా అవుతూ అప్రిసియేట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ టీజర్ లో రకుల్ ప్రీత్ సింగ్ నేరుగా ఎక్కడా కనిపించలేదు. టీజర్ లో రొమాంటిక్ సీన్స్ ఉన్నపటికీ రకుల్ మాత్రం కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. ఇందుకు కారణం.. రకుల్ రొమాంటిక్ సీన్స్ తోనే సెపెరేట్ గా మరో టీజర్ వదలడానికేనట. ఈ మేరకు ఈ టీజర్ డిజైన్ చేసే పనిలో పడ్డారట నాగార్జున, రాహుల్ రవీంద్రన్.
రకుల్ పోషించిన అవంతి పాత్రతో ఈ టీజర్ కట్ చేసి.. మన్మథుడు 2 సినిమాలో ఆమెకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందనేది తెలుపుతారట. సీనియర్ హీరోతో రొమాన్స్ చేసినా కూడా రకుల్ క్యారెక్టరైజేషన్ డిఫెరెంట్ గా చూపించనుందట మన్మథుడు 2 యూనిట్. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున హీరోగా నటిస్తుండగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. సమంత, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. చాలా రోజుల తర్వాత నాగార్జున లోని మన్మథుడిని చూడాలని ఈ సినిమాపై ప్రేక్షకులు ఫుల్లుగా ఆశలు పెట్టుకున్నారు.