Don't Miss!
- News నాకు అండగా, చీకటిలో వెలుగుగా..
- Travel వేసవిలో సందర్శించేందుకు దేశంలోని బెస్ట్ ఆఫ్బీట్ హిల్ స్టేషన్లు ఇవే..
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
ప్రభాస్ తమ్ముడిగా యాక్షన్ హీరో: కండల వీరుడిని ఫైనల్ చేసిన బాలీవుడ్ డైరెక్టర్
చాలా రోజుల పాటు తెలుగు హీరోగా కనిపించి.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్గా వెలుగొందుతున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. గతంలో చిన్న చిన్న సినిమాల్లో మాత్రమే నటించిన అతడు.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' నుంచి తన పంథాను మార్చుకున్నాడు. ఇందులో భాగంగానే వరుసగా పాన్ ఇండియా చిత్రాల్లోనే నటిస్తున్నాడు. ఇప్పటికే 'సాహో'తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అతడు.. ప్రస్తుతం 'రాధే శ్యామ్'లో నటిస్తున్నాడు. దీని తర్వాత మరిన్ని చిత్రాలను ప్రకటించాడు. అందులో బాలీవుడ్ చిత్రం 'ఆదిపురుష్' కూడా ఒకటి.
పూనమ్ భజ్వా కొత్త లుక్ మాములుగా లేదు (ఫొటోలు)
హిందీ చిత్ర పరిశ్రమకు చెందిన ఓం రౌత్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ నటిస్తోన్న చిత్రం 'ఆదిపురుష్'. టీ సిరీస్ బ్యానర్లో తెరకెక్కనున్న ఈ సినిమా చెడు మీద మంచి గెలవడం అనే కాన్సెప్ట్తో రాబోతుంది. ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. అలాగే, బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రను పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో లక్ష్మణుడిగా ఎవరు నటిస్తారన్న దానిపై కొద్ది రోజులుగా చర్చలు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే కొంత మంది హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా ఓ హీరో పేరు బయటకు వచ్చింది.
తాజా సమాచారం ప్రకారం.. 'ఆదిపురుష్'లో ప్రభాస్ తమ్ముడి పాత్రను బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ చేయబోతున్నాడట. సల్మాన్ ఖాన్ తర్వాత కండల వీరుడిగా పేరొందిన అతడు.. ఈ సినిమాలో నటించేందుకు పచ్చజెండా ఊపేశాడని ఓ న్యూస్ బీ టౌన్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉండగా, ఈ సినిమాలో సీతగా కృతీ సనన్ను తీసుకున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది.