Don't Miss!
- Sports KKR Playing XI: రూ. 24.75 కోట్ల ఆటగాడిపై వేటు! పంజాబ్తో తలపడే కేకేఆర్ తుది జట్టు ఇదే!
- News మరో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల: బరిలో తీన్మార్ మల్లన్న
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
టాలీవుడ్ లో మరో విషాదం.. దర్శకుడు, ఛాయాగ్రాహకుడు రాజేంద్ర ప్రసాద్ కన్నుమూత
తెలుగు చిత్ర పరిశ్రమలో మరొక తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇటీవల కాలంలో కొంతమంది సినిమా టెక్నిషియన్స్ అకాల మరణాలు ఇండస్ట్రీలోని అందరిని కూడా షాక్ కు గురి చేశాయి. ఇక రీసెంట్ గా మరొక ప్రముఖ టెక్నీషియన్ కూడా కన్నుమూయడం అందరిని విషాదంలోకి నెట్టేసింది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఛాయాగ్రకుడిగా అలాగే దర్శకుడిగా మంచి గుర్తింపు అందుకున్న రాజేంద్రప్రసాద్ తుది శ్వాస విడిచారు. కేవలం దర్శకుడిగానే కాకుండా ఆయన సినిమాటోగ్రఫర్ గా అలాగే నిర్మాతగా కూడా పలు సినిమాలతో మంచి గుర్తింపు అందుకున్నారు.
సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది కొత్త వారికి కూడా వారు అవకాశాలు ఇచ్చారు. ముఖ్యంగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న కొన్ని మంచి కథాంశాలను కూడా ఆయన తెరపైకి తీసుకువచ్చారు. ఆ నలుగురు సినిమా దర్శకుడు చంద్ర సిద్ధార్థ సోదరులు అయినటువంటి రాజేంద్రప్రసాద్ ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులతో ఎంతో స్నేహంగా కొనసాగుతూ వచ్చారు. ఇక ఆయన సినిమాల విషయానికొస్తే మొదట తెలుగు సినిమాలో నిరంతరం అనే సినిమాను తెరపైకి తీసుకువచ్చారు.
ఆ సినిమాతో దర్శకుడుగానే కాకుండా నిర్మాతగా కూడా ఆయన మంచి గుర్తింపును అందుకున్నారు. 1995లో వచ్చిన ఆ సినిమా పలు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో కూడా ప్రత్యేకంగా ప్రదర్శించబడింది. ముఖ్యంగా మలేషియాలోని కైరో ఫిలిం ఫెస్టివల్ కు కూడా సందడి చేసింది. ఇక హాలీవుడ్లో మన్ విమన్ అండ్ ది మౌస్', 'రెస్డ్యూ - వేర్ ది ట్రూత్ లైస్' 'ఆల్ లైట్స్, నో స్టార్స్' చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇక ఇందులో ఆయన కెరీర్లో విశేషం ఏమిటి అంటే ఆయన ఎలాంటి సినిమాను తెరపైకి తీసుకువచ్చినా కూడా ఆయనే సొంతంగా సినిమా ఫోటోగ్రాఫర్ గా కూడా వర్క్ చేసేవారు.
అలాగే రైటింగ్ లో కూడా ఆయన మంచి గుర్తింపు అందుకున్నారు. తెలుగులో అయితే 'మేఘం' అలాగే 'హీరో' సహా పలు చిత్రాలకు రాజేంద్రప్రసాద్ సినిమాటోగ్రఫీ సేవలు అందించారు. అలాగే హిందీ చిత్ర పరిశ్రమంలో కూడా ఆయన కొన్ని సినిమాలకు వర్క్ చేశారు. చాలాకాలంగా అయినా ముంబైలోనే ఉంటున్నారు. ఇక హఠాత్తుగా పలు అనారోగ్య కారణాల వలన ఆయన మృతి చేశారు. ఈ వార్త తెలుసుకోగానే సినీ ప్రముఖుల అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఇక ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సినీ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు