Don't Miss!
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- News విశాఖ లోక్సభ పరిధిలో ఆ సామాజిక వర్గందే పెత్తనం..బొత్స ఝాన్సీకి కలిసొస్తుందా..?
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
టాప్ డైరెక్టర్లందరూ ఒకే ఫ్రేమ్లో.. అల వైకుంఠపురములో గ్రాండ్ పార్టీ
అల వైకుంఠపురములో ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో.. ఇంకా చేస్తూనే ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్లో, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఈ రికార్డుల పరంపరలో ఎన్నో చోట్ల నాన్ బాహుబలి రికార్డులు చెదిరిపోయాయి. ముఖ్యంగా ఓవర్సీస్లో బన్నీ ఓ రేంజ్లో దూసుకుపోయాడు.
తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి తరువాత..
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు అల వైకుంఠపురములో దాదాపు 150కోట్ల షేర్ను వసూళ్లు చేసినట్టు తెలుస్తోంది. బాహుబలి మినహా మరేతర చిత్రాలు ఈ ఫీట్ను అందుకోలేదు. అయితే అల వైకుంఠపురములో అవలీలగా అందుకుంది.
ఓవర్సీస్లోనూ రికార్డులు..
ఓవర్సీస్లో మాటల మాంత్రికుడు మాయాజాలం పనిచేసింది. నాన్ బాహుబలి పేరిట ఉన్న రంగస్థలం రికార్డులను బన్నీ చెరిపేశాడు. రంగస్థలం లాంగ్ రన్లో 3.52 మిలియన్ డాలర్లను కొల్లగొడితే.. వాటిని బ్రేక్ చేసేసింది. బన్నీ ప్రస్తుతం నాలుగు మిలియన్ల డాలర్ల వైపు పరిగెడుతున్నాడు.
|
ఇండస్ట్రీ హిట్..
దాదాపు 150కోట్ల షేర్, 250కోట్ల గ్రాస్ను కొల్లగొట్టిన అల వైకుంఠపురములో ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఈ రేంజ్ సక్సెస్ సాధించిన చిత్రానికి సక్సెస్ పార్టీ కూడా అంతే రేంజ్లో చేయాలని భావించింది యూనిట్. ఈ క్రమంలోనే టాలీవుడ్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్కు ఓ గ్రాండ్ పార్టీ ఇచ్చింది.
లెజెండ్ నుంచి లేటెస్ట్..
గత రాత్రి ఎంతో గ్రాండ్గా జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ మేరకు ఓ ఫోటోను షేర్ చేస్తూ బన్నీ ఓ ట్వీట్ చేశాడు. ‘ఇంటికి వచ్చి మా వేడుకల్లో భాగమైనందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి సెలెబ్రేషన్ నాకు ఎప్పటికీ ప్రత్యేకమైనదే.. అయితే మీ రాకతో ఈ సెలెబ్రేషన్స్ ను నాకు మరింతగా గుర్తుండిపోయేలా చేశారు. మీ అందరికీ నా ధన్యవాదాలు' అంటూ పేర్కొన్నాడు. ఈ వేడుకలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మొదలుకుని.. పరుశురామ్, మారుతి వంటి వారు సైతం హాజరయ్యారు.