Don't Miss!
- News Iran Israel War: ఇరాక్ నూ కెలికిన ఇజ్రాయెల్? ఇరాన్ ఉమ్మడి పోస్టుపై దాడి-పోరు తీవ్రం..!
- Finance Ola Cabs IPO: త్వరలో ఓలా క్యాబ్స్ ఐపీఓ..
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
Pawan kalyan వివాదం : ఏపీ మంత్రి ఇంటికి దిల్ రాజు సహా నిర్మాతలు..ఏం జరుగుతోంది?
ఆంధ్రప్రదేశ్ సినిమా టికెట్ల రేట్లు పెంపు విషయంలో అలాగే ఆన్ లైన్ టికెటింగ్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే సినీ పరిశ్రమ మధ్య నలుగుతున్న సందిగ్ధత ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కొన్ని కామెంట్స్ చేయడంతో ఏపీ చుట్టూనే సినీ రాజకీయ ఇప్పుడు జరుగుతోంది.
ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ సినిమా ఫంక్షన్ లో చేసిన వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రకటించగా ఇప్పుడు తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు సునీల్ నారంగ్ సహా దిల్ రాజు, డి.వి.వి.దానయ్య లాంటి అగ్ర నిర్మాతలు అందరూ ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నానితో భేటీ కావడానికి మచిలీపట్నం వెళ్లారు. ఆ వివరాల్లోకి వెళితే
పవన్ వ్యాఖ్యల కలకలకం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన మాటలతో తమకు సంబంధం లేదని ఫిలిం ఛాంబర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం చెప్పినట్లుగానే ఆన్లైన్ లో సినిమా టికెట్లు అమ్ముకోవడానికి నిర్మాతలు సహా ఫిలిం ఛాంబర్ కూడా అంగీకరించింది. అయితే ఈ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్న క్రమంలోనే దిల్ రాజు సహా టాలీవుడ్ లో టాప్ నిర్మాతలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరగడానికి వెళ్లడం ఆసక్తికరంగా మారింది.
ఇప్పటికే కొద్ది రోజుల క్రితం అమరావతిలో పేర్ని నానితో భేటీ అయిన సినీ నిర్మాతల బృందం సినిమా హాళ్ల నిర్వహణ, విద్యుత్ చార్జీల్లో రాయితీలు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరారు, కొన్ని సినిమాలకైనా బెనిఫిట్ షోలకు వెసులుబాటు కల్పించేలా చూడాలని ఏపీ ప్రభుత్వానికి ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు కోరారు.
|
పేర్ని నాని ఇంటికి
అయితే గతంలో అమరావతితో మంత్రితో భేటీ కాగా ఇప్పుడు మంత్రి స్వగృహానికి సినీ బృందం వెళ్ళింది. మంత్రి పేర్ని నానితో భేటీ కి మచిలీ పట్నం వచ్చారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు నేతృత్వంలోని సినీ బృందం. ప్రభుత్వం టిక్కెట్ల విక్రయం, ఇతర సినిమా రంగం అంశాలపై భేటీ జరగనున్నట్టు చెబుతున్నారు. రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభుత్వ ఆలోచనలను తీవ్రంగా తప్పు పట్టారు పవన్ కళ్యాణ్.
జగన్ తో మాట్లాడమన్న పవన్
ఇక పవన్ వ్యాఖ్యలతో ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు, ఫిలిం చాంబర్ కూడా విభేదించిన సంగతి తెలిసిందే. ఆంధ్ర ప్రదేశ్ సీఎం మీ రెడ్డే కాబట్టి ఆయనతో మాట్లాడాలి అంటూ తన ప్రసంగం లో దిల్ రాజు పేరును పవన్ ప్రస్తావించారు. ఈ కామెంట్స్ కలకలం రేగగా ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు అంటూ పలువురు నిర్మాతలు ఇప్పుడు మంత్రిని కలిసేందుకు వెళ్లడం షాకింగ్ గా మారింది.
పోసాని కామెంట్స్ ఆసక్తికరంగా
ఇక ప్రస్తుతం పేర్ని-దిల్ రాజు భేటీలో ఈ అంశాలతో పాటు పవన్-పోసాని కామెంట్స్ పై ప్రస్తావన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఈ ఎపిసోడ్ కి వీలైనంత త్వరలో ముగిస్తే బాగుండునని సినీ పెద్దలు అనుకుంటున్నారు. ఇక మంత్రి పేర్ని నానిని కలిసేందుకు మచిలీపట్నం చేరుకున్న దిల్ రాజు వెంట డీవీవీ దానయ్య, సునీల్ నారంగ్, బన్నీ వాసు ఇతర నిర్మాతల బృందం ఉంది.
Recommended Video
ఏం జరగనుంది?
ఇక ఇటీవల పవన్ పేర్ని నాని మధ్య మాటల తూటాల నేపథ్యంలో మంత్రి వద్దకు నిర్మాతల బృందం వెళ్లడంతో ఏం జరిగింది అనేది ఆసక్తికరంగా మారింది. నిన్న మంత్రికి ఫోన్ చేసి నిర్మాతలు వస్తారని సమాచారం ఇవ్వగా తాను ఇంట్లోనే ఉంటానని నాని చెప్పారని అందుకే ఈరోజు మధ్యాహ్నం మచిలీపట్నం లో ఉన్న మంత్రి ఇంటికి చేరుకొన్న నిర్మాతలు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.