బాత్రూంలో కాలుజారి పడి టాలీవుడ్ టాప్ డైరెక్టర్ మృతి.. ఎవరో తెలుసా?
ఈ మధ్య సినీ రంగానికి చెందిన చాలా మంది ప్రముఖులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు ప్రాణాలు కోల్పోగా.. తాజాగా తెలుగు సినీ రంగానికి చెందిన మరో టాప్ ప్రొడ్యూసర్ పరమపదించారు. ముఖ్యంగా ఈరోజు బాలీవుడ్ కు చెందిన ఓ టాప్ డైరెక్టర్ కుమార్ సహానీ చనిపోయిన విషయం వెలుగులోకి రాగానే.. మరో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ చనిపోయినట్లు తెలిసింది. అయితే ఆ వివరాలు ఏంటి, ఎలా చనిపోయారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తెలుగు సినీ రంగానికి చెందిన ప్రముఖ నిర్మాత వి మహేష్ ఈరోజు కన్నుమూశారు. ముఖ్యంగా 85 ఏళ్ల వయసు కల్గిన ఈయన ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ.. తాజాగా బాత్రూంలో ఆయన కాలుజారి పడినట్లు తెలుస్తోంది. అయితే బాత్రూంలో పడ్డ ఆయనకు తీవ్ర గాయాలు కాగా.. వెంటనే కుటుంబ సభ్యులు విషయం గుర్తించి ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. కానీ ఫలితం లేకపోయింది. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపినట్లు సమాచారం.

అయితే ప్రొడ్యూసర్ మహేష్ చనిపోయినట్లు తెలుసుకున్న సినీ ప్రముఖులు అంతా ఆనయకు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేధికగా నివాళులు అర్పిస్తూ... ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నట్లు తెలిపారు. మరోవైపు మహేష్ అంత్యక్రియలను సోమవారం రోజు మధ్యాహ్నం చెన్నైలో నిర్వహించనున్నట్లు ఆయన మేనల్లుడు టెలివిజన్ నిర్మాత, దర్శకుడు వల్లభనేని మహీధర్ చెప్పారు. మహేష్ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. ఒంటరిగానే ఆయన ఇన్నాళ్లూ జీవనం కొనసాగించారు.
1975వ సంవత్సరంలో మహేష్ మాతృమూర్తి సినిమా ద్వారా నిర్మాతగా మారారు. ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా వచ్చిన మనుషులంతా ఒక్కటే, మహాపురుషుడు, సింహపురి సింహం, ముసుగు దొంగ వంటి చిత్రాలను నిర్మించారు. ఇవి మాత్రమే కాకుండా అనేక సీరియళ్లకు రైటర్ గా నిర్మాతగా పని చేశారు. మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. కానీ బాత్రూంలో కాలు జారి పడి ప్రాణాలు కోల్పోయారు.


Click it and Unblock the Notifications











