Don't Miss!
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Technology ఫిజికల్ బటన్ లు లేకుండా రానున్న iPhone 16 ! డిజైన్ వివరాలు లీక్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
త్రివిక్రమ్ - మహేశ్ బాబు మూవీ అప్డేట్: అందరూ అనుకున్నదే నిజమట
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫుల్ జోష్తో కనిపిస్తున్నాడు. ఇప్పటికే వరుసగా 'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి భారీ విజయాలను అందుకున్న అతడు.. రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే సినిమాను చేస్తున్నాడు. ఇది పట్టాలపై ఉండగానే.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో మరో సినిమాను ప్రకటించాడు. దీనిపై ఎన్నో ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్పై తాజాగా క్లారిటీ వచ్చేసింది.
మే 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు. దీనిని పురస్కరించుకుని త్రివిక్రమ్ శ్రీనివాస్ - మహేశ్ బాబు కాంబినేషన్లో రాబోతున్న మూవీకి సంబంధించిన అప్డేట్ ఇస్తారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అలాంటిది ఏమీ ఉండదు అని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఆరోజున ఈ సినిమా టైటిల్ను రివీల్ చేయబోతున్నారట. ఈ మేరకు ఓ ఫస్ట్ లుక్ పోస్టర్ను కూడా విడుదల చేస్తారని తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది. ఇందులోనే సినిమా కాన్సెప్టును కూడా డిజైన్ చేశారన్న టాక్ బాగా వినిపిస్తోంది.
ఇక, త్రివిక్రమ్ - మహేశ్ బాబు కలయికలో రాబోతున్న ఈ మూవీకి 'పార్థు' అనే టైటిల్ అనుకుంటున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఇది వర్కింగ్ టైటిల్ మాత్రమేనని కూడా ప్రచారం జరిగింది. దీంతో అసలు టైటిల్ ఏమై ఉంటుందా అన్న ఆసక్తి సర్వత్రా కనిపిస్తోంది. ఇదిలా ఉండగా.. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాలో మహేశ్ బాబు రా ఏజెంట్గా కనిపిస్తాడని అంటున్నారు. ఇందులో అతడి సరసన జాన్వీ కపూర్ నటిస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.