Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
బిగ్ బాస్ హౌస్లో ఏడో కంటెస్టెంట్గా రోహిణి.. జబర్దస్త్లో కూడా...
గత రెండు సీజన్లు సాఫీగా సాగిన బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ మూడో సీజన్ విషయంలో మాత్రం వివాదాల్లో ఇరుక్కుంది. షో ప్రారంభానికి ముందే ఈ షో బ్యాన్ చేయాలంటూ పలు అవాంతరాలు ఎదురయ్యాయి. శ్వేతా రెడ్డి, గాయత్రీ గుప్తా లాంటి వారి ఆరోపణలు, ఓయూ జెఏసి నిరసనలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ వాటన్నింటినీ అధిగమించి బిగ్ బాస్ షో అట్టహాసంగా ప్రారంభమైంది.
100 రోజుల పాటి నిర్విరామంగా జరగనున్న ఈ షోకి హోస్ట్ గా నాగార్జున వ్యవహరిస్తున్నాడు. ముందుగా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన ఆయన పార్టిసిపెంట్స్ ఒక్కొక్కరినీ బిగ్ బాస్ హౌస్లోకి ఆహ్వానిస్తున్నారు. మొత్తం 15 మంది కంటిస్టెంట్లు పాల్గొననున్న ఈ రియాలిటీ షోలో ఏడో కంటెస్టెంట్గా టీవీ నటి రోహిణి అడుగు పెట్టారు. బిగ్ బాస్ హౌస్లోకి సాదరంగా ఆహ్వానించిన నాగార్జున.. రోహిణి గురించి ప్రేక్షకులకు ఇంట్రో ఇచ్చాడు.
టీవీ నటి రోహిణి.. సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం హైదారాబాద్లో అడుగుపెట్టింది. కానీ, తర్వాత నటి అవ్వాలనే ఆలోచనలతో టీవీ సీరియల్ ఆడిషన్స్కు వెళ్లి సెలెక్ట్ అయింది. ఆ తర్వాత పలు సీరియల్స్ ద్వారా ఫుల్లుగా ఫేమస్ అయింది. మొదటి సీరియల్లోనే రాయలసీమ యాసతో అదరగొట్టేసింది రోహిణి. ఆ తర్వాత మరిన్ని సీరియల్స్లో అవకాశాలు దక్కించుకుంది. అంతేకాదు, ఈమె ప్రముఖ చానెల్లో ప్రసారం అయ్యే జబర్ధస్త్ షోలో కూడా పలు స్కిట్స్ చేసింది. ఈలోగా ఈ రియాలిటీ షోలో అవకాశం రావడంతో ఇటు వచ్చేసింది. నాగ్ ఆమెను లోపలికి పంపించగా, ముందుగా వెళ్లిన కంటెస్టెంట్లు ఆమెను సాదరంగా ఆహ్వానించారు.