Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రామ్ చరణ్ సతీమణి ఉపాసన రిక్వెస్ట్.. ఎవరూ పట్టించుకోవట్లేదంటూ మెసేజ్
సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ ఉండే సెలెబ్రిటీల్లో ఎప్పుడూ ముందుంటుంది రామ్ చరణ్ సతీమణి ఉపాసన. ఎప్పటికప్పుడు తన విశేషాలు, రామ్ చరణ్ సినిమా సంగతులు, అలాగే సోషల్ వర్క్ లాంటి ఎన్నో అంశాలపై పోస్టులు పెడుతూ అందరికీ ఆదర్శంగా ఉండటం ఈమె స్టైల్. అదే బాటలో కొత్త సంవత్సరం వస్తుండటంతో కొన్ని రోజుల ముందుగానే అందరికీ అలర్ట్ చేసింది ఉపాసన. ఇంతకీ ఏంటా అలర్ట్? వివరాల్లోకి పోతే..
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. పూలు, బొకేలు
న్యూ ఇయర్ వచ్చిందంటే చాలు దేశమంతా సంబరాల్లో మునిగి తేలుతూ ఉంటుంది. ఎవరికీ వారు తమ తమ ఆత్మీయులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ మేరకు ఆ శుభాకాంక్షల్లో భాగంగా బొకేలు ఇచ్చుకుంటారు. అదే విధంగా ఇళ్లను పూలతో అందంగా డెకరేట్ చేసుకుంటారు.
ఉపాసన రిక్వెస్ట్..
పూలతోనే కొత్త సంవత్సరం సందర్బంగా ఇంటికి కొత్త అందం తెస్తుంటారు జనం. పువ్వులను విరివిగా వాడుతూ కొన్ని వేస్ట్ కూడా చేస్తుంటారు. ఇది ఎక్కడనైనా సాధారణంగా గమనించే అంశమే. సరిగ్గా ఈ అంశాన్నే తీసుకొని న్యూ ఇయర్ సందర్బంగా అందరినీ రిక్వెస్ట్ చేసింది రామ్ చరణ్ సతీమణి ఉపాసన.
వృధాగా పడేసిన పూలను ఇలా చేయండి
పూలంటే తనకు ఎంతో ఇష్టమని పేర్కొంటూ, పూలతో చేసిన అలంకరణ, డెకరేషన్ కూడా తనకు ఎంతగానో ఆనందాన్ని ఇస్తుందని తెలిపింది ఉపాసన. అయితే అలా వాడిన పూలను ఆ తర్వాత వృధాగా పడేయడం పట్ల తనకు ఓ క్లారిటీ వచ్చింనద్నారు. పూల ద్వారా ఉత్తత్తి అయ్యే వేస్టేజ్ను రీసైక్లింగ్ చేయండన్నారు.
వాడతారు.. కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు
హోలి వేస్ట్ అనే స్టార్టప్ కంపెనీ వారంలో మూడు సార్లు వందల కిలోల పూల వేస్టేజ్ను సేకరిస్తుందని ఈ సందర్బంగా ఉపాసన తెలిపారు. ప్రతీఒక్కరూ ఏదో ఒక సందర్భంలో పూలను వాడుతుంటారు. కానీ వాటి ద్వారా మనం ఉత్పత్తి చేసే వృధాను మాత్రం ఎవరూ పట్టించుకోవట్లేదన్నారు. దయచేసి మీరు కూడా పూలను వృధా చేయకండి అని పేర్కొన్నారు ఉపాసన.
ఉపాసన కొణిదెల.. ఇదీ మెసేజ్
పువ్వులు, మాలికల్ని ఎండబెట్టి రీ సైక్లింగ్ చేయడం ద్వారా దూప్ స్టిక్స్ లేదా అగరబత్తీలు తయారు చేయొచ్చని చెప్పారు ఉపాసన. అంతేకాదు ఈ ప్రక్రియ చాలా సులువు అని కూడా తెలిపారు. తనకు కూడా పూలంటే ఎంతో ఇష్టమని, ప్రకృతికి అనుకూలంగా ఆ పూలను ఎక్కువగా వృధా చేయకండి అంటూ ఇలా న్యూ ఇయర్ మెసేజ్ పాస్ చేశారు ఉపాసన కొణిదెల.