Don't Miss!
- News కాంగ్రెస్ లో చేరిక పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే బిగ్ ట్విస్ట్..!!
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Finance Tata Sons IPO: టాటా సన్స్ ఐపీఓ వస్తుందా.. రాదా..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
KGF దర్శకుడిని కలిసిన ఉప్పెన దర్శకుడు.. అప్పుడు సెటైర్ వేసి.. ఇప్పుడు ఇలా..
పుష్ప సినిమా గురించి సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు అప్పట్లో ఇచ్చిన ఎలివేషన్ గురించి అందరికి తెలిసిందే. ఏకంగా 10 KGF లతో సమానం అంటూ అందరికి ఆశ్చర్యాన్ని కలిగించాడు. ఆ సినిమా ఆ స్థాయిలో ఉందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే దర్శకుడు బుచ్చిబాబుపై ఓ వర్గం నెటిజన్లు మాత్రం మండిపడ్డారు. ముఖ్యంగా యష్ అభిమానులు ఆ కామెంట్స్ పై తీవ్రంగా ట్రోల్ చేశారు. ఇక ఇప్పుడు బుచ్చిబాబు హఠాత్తుగా KGF దర్శకుడిని కలిశాడు. ఎందుకు కలిసాడు అనే వివరాల్లోకి వెళితే...
సుకుమార్ శిష్యుడిగా..
సుకుమార్ దగ్గర వన్ నేనొక్కడినే సినిమా నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన బుచ్చిబాబు ఆ తర్వాత కంటిన్యూగా తన గురువు దగ్గర సినిమాలకు కథారచనలో సహకారం అందిస్తూనే మరొకవైపు సహాయక దర్శకుడిగా కూడా కొనసాగాడు. ముఖ్యంగా రంగస్థలం సినిమాలో అతని పాత్ర చాలా ఉంది అని సుకుమార్ చాలా ఓపెన్గానే తెలియజేశాడు.
వందకోట్ల సినిమా
ఇక సుకుమార్ సపోర్ట్ తోనే ఉప్పెన సినిమా కథను సిద్ధం చేసుకున్న బుచ్చి బాబు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమా మార్కెట్లో వందకోట్ల వ్యాల్యూ చేయడంతో అతని స్థాయికి కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. బుచ్చిబాబు కథ చెప్పడానికి వస్తే ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే ఒప్పుకోడానికి సిద్ధంగా ఉంటారు అని చెప్పవచ్చు.
10 KGFలతో సమానం అంటూ..
అయితే గతంలో బుచ్చిబాబు తన గురువు సినిమాను హైలెట్ చేయాలి అని కాస్త తొందరపాటులో కేజిఎఫ్ సినిమాను తగ్గించి మాట్లాడినట్లు అనిపించింది. పుష్ప సినిమా 10 కేజీఎఫ్ లతో సమానంగా ఉంటుంది అని బుచ్చిబాబు కామెంట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ విషయంలో ఓ వర్గం అభిమానులు మాత్రం తీవ్రస్థాయిలో అసంతృప్తి చెందారు. సినిమా చూసిన తర్వాత ఆ రేంజిలో ఏమీ లేదు అని కూడా అన్నారు.
ఎలాంటి పోస్ట్ చేసినా..
బుచ్చి బాబు చేసిన కామెంట్లతో కేజిఎఫ్ అభిమానులుతీవ్ర స్థాయిలో సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా చేశారు. ఇక ఆ తర్వాత బుచ్చిబాబు సోషల్ మీడియాలో ఎలాంటి కామెంట్ చేసినా కూడా ఆ విషయాన్ని లాగుతున్నారు. ఇటీవల బుచ్చిబాబు సర్కారు వారు పాట సినిమా చూశాను అని కామెంట్ చేశాడు. ఆ పోస్ట్ పై కూడా భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి.
ప్రశాంత్ నీల్ తో మీటింగ్
అయితే బుచ్చిబాబు హఠాత్తుగా కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కలిసి ఫోటోలు దిగారు. అతనితో ప్రత్యేకంగా కలుసుకొని కొంతసేపు మాట్లాడడం జరిగింది అని అందుకు చాలా సంతోష పడుతున్నాను అంటూ బుచ్చిబాబు సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేస్తూ క్లారిటీ ఇచ్చాడు. ఇక ఈ ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఎన్టీఆర్ సినిమాలతో..
ఇక వీరిద్దరూ ఎందుకు కలుసుకున్నారు అనే విషయంపై మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ ఇద్దరు కూడా నెక్స్ట్ ఎన్టీఆర్ తో వర్క్ చేయబోతున్న విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ ప్రభాస్ సలార్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ 31వ సినిమాను డైరెక్ట్ చేయబోతుండగా.. ఆ తర్వాత బుచ్చి బాబు కూడా ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు చర్చలు జరుపుతున్నారు.