ఉప్పెన ఫస్ట్ వేవ్.. కన్ఫ్యూజన్లో నెటిజన్లు.. సమాధానమిస్తున్న మైత్రీ
తాజాగా ఉప్పెన ఫస్ట్ వేవ్ రిలీజైంది. ప్రేమలోని విరహాన్ని వైష్ణవ్ తేజ్ పలికిస్తున్నట్టున్నాడు. అందుకు తగ్గట్టు దేవీ తన బాణీని కూడా మలిచినట్టు కనిపిస్తుంది. హీరోను, హీరోయిన్ను అంతగా చూపించకుండా.. సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ ఫస్ట్ వేవ్ ఆకట్టుకునేలానే ఉన్నా.. అందులో హీరో చెప్పిన డైలాగ్ ఏంటో అర్థంకాకుండా పోయింది.
ఇదే విషయాన్ని ఓ నెటిజన్ ప్రస్థావించగా.. నిర్మాణ సంస్థ అయిన మైత్రీ స్పందించింది. అసలేం అంటున్నావ్ అని సదరు నెటిజన్ అడగ్గా.. 'బేబమ్మ' అంటూ మైత్రీ రిప్లై ఇచ్చింది. ఇలా ఫస్ట్ వేవ్లోనే ఇంతటి కన్ఫ్యూజన్ ఉంటే ఎలా..మాటలైనా సరిగా వినిపించాలి కదా అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఈ మధ్య అసలే దేవీ సంగీతంపై బ్యాడ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ ఒకప్పటి సంగీత సంచలనం. రాక్ స్టార్గా తెలుగు నాట పాపులర్ అయిన మ్యూజిక్ డైరెక్టర్ గత కొన్ని రోజులుగా అలరించే సంగతాన్ని అందించలేకపోతున్నాడు. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ఉప్పెన.. ఓ ఫీల్ గుడ్ ఆల్బమ్ అని తెలుస్తోంది. ఈ సినిమాలో అన్ని పాటలు అదిరిపోయాయని సమాచారం. తాజాగా వదిలిన ఫస్ట్ వేవ్లోనూ ఏదో మ్యాజిక్ ఉన్నట్టు అర్థమవుతూనే ఉంది. మరి ఈ సినిమా దేవీకి, వైష్ణవ్ తేజ్కు ఎలాంటి పేరు తెస్తుందో చూడాలి. ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదల కాబోతోంది.


Click it and Unblock the Notifications











