Don't Miss!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Sports Rishabh Pant: నోకియా వల్ల కాదు.. అదే మా కొంపముంచింది
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
త్రివిక్రమ్ నుంచి మరో విభిన్నమైన టైటిల్.... అల్లు అర్జున్ 19 మూవీకి ఆ పేరే ఫైనల్?
అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. బన్నీ కెరీర్లో తెరకెక్కుతున్న 19వ చిత్రమిది. ఈ మూవీ టైటిల్ ఆగస్టు 15న ప్రకటించబోతున్నట్లు చిత్ర బృందం ఓ స్టేట్మెంట్ విడుదల చేసింది. ఈనేపథ్యంలో బన్నీ ఈ సారి ఎలాంటి టైటిల్తో రాబోతున్నాడు? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే నేను నాన్న, అలకానంద అనే టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఇవేవీ ఫైనలైజ్ కాలేదు. అయితే త్రివిక్రమ్ మైండ్లో ఈ టైటిల్స్ లేవని, ఫ్యామిలీ ఎంటర్టెనర్గా రూపొందుతున్న ఈ చిత్రానికి ఆయన ఇంతకు మించిన సరికొత్త టైటిల్ ప్లాన్ చేస్తున్నారట.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 'వైకుంఠ పురంలో..' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది దాదాపుగా ఫైనలైజ్ అయినట్లే అని అంటున్నారు. మరి ఆగస్టు 15న ఇదే టైటిల్ ప్రకటించబోతున్నారా? లేక త్రివిక్రమ్ మైండ్లో ఇంకేదైనా ఉందా? అనేది తెలియాలంటే మరో రెండ్రోజులు ఆగాల్సిందే.
త్రివిక్రమ్ గత సినిమాలు పరిశీలిస్తే.... అత్తారింటికి దారేది, అ..ఆ, అజ్ఞాతవాసి, అరవింద సమేత... ఇలా అన్నీ విభిన్నంగానే ప్లాన్ చేశారు. ఇపుడు బన్నీతో చేస్తున్న మూవీకి కూడా అదే తరహాలో ఇంప్రెసివ్ టైటిల్ పెట్టాలని చూస్తున్నారని, అందుకే 'వైకుంఠ పురంలో' ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంటగా నిర్మిస్తున్నాయి.