Don't Miss!
- News Modi-Hanuman Chalia:హనుమాన్ ఛాలీసాపై ప్రధాని మోదీ వివాదాస్పద వ్యాఖ్యలు..!
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
Kondapolam Official Trailer: అడవిలోని మృగాలతో మెగా హీరో ఫైట్.. క్రిష్ మార్కు మెసేజ్
తెలుగు ససినీ పరిశ్రమలోకి ఎంతో మంది వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు.. ఇస్తున్నారు. అందులో చాలా తక్కువ మంది మాత్రమే ప్రేక్షకుల నుంచి ఆదరాభిమానాలను అందుకుంటూ భారీ స్థాయిలో సక్సెస్ అవుతున్నారు. దీంతో ఇండస్ట్రీలోని బడా ఫ్యామిలీలతో పాటు మిగిలిన సెలెబ్రిటీల కుటుంబాల నుంచి చాలా మంది హీరోలుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇలా ఈ మధ్య కాలంలో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన హీరోల్లో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఒకడు. చిన్న వయసులోనే తెరంగేట్రం చేసిన అతడు.. ఈ ఏడాది ఆరంభంలోనే 'ఉప్పెన' మూవీతో హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే.
అందాలన్నీ చూపిస్తూ రెచ్చిపోయిన పవన్ హీరోయిన్: బట్టలు ఉన్నా లేనట్లే.. మరీ ఇంత దారుణంగానా!
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర అసిస్టెంట్గా పని చేసిన బుచ్చిబాబు సన దర్శకత్వంలో వచ్చిన 'ఉప్పెన'తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు వైష్ణవ్ తేజ్. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. తద్వారా బాక్సాఫీస్పై దండయాత్ర చేసిన ఈ యంగ్ హీరో.. మొదటి సినిమాతోనే యాభై కోట్ల రూపాయల క్లబ్లో చేరిపోయి టాలీవుడ్లో రికార్డును క్రియేట్ చేశాడు. దీంతో అతడికి హీరోగా అదిరిపోయే ఎంట్రీ దక్కినట్లైంది. ఇక, ఇందులో నటుడిగానూ వైష్ణవ్ తేజ్ మెప్పించాడు. తద్వారా విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుని అందరి దృష్టినీ ఆకర్షించాడు.
వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన' మూవీ విడుదల కాకముందే తన రెండో చిత్రం 'కొండపొలం'ను పూర్తి చేసుకున్నాడు. టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి రూపొందించిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా చేసింది. ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఎప్పుడో పూర్తి అయ్యాయి. కానీ, అనివార్య కారణాల వల్ల దీని నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని మరోసారి తెరపైకి తీసుకు రావడంతో పాటు త్వరలోనే ప్రేక్షకుల ముందు ఉంచాలని మూవీ యూనిట్ నిర్ణయించుకుంది. దీంతో దీన్ని అక్టోబర్ 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు ఇటీవలే ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ను వదిలారు.
అరాచకమైన ఫొటోలతో షాకిచ్చిన అమలా పాల్: బీచ్లో బికినీతో అందాలు మొత్తం కనిపించేంత ఘాటుగా!
'కొండపొలం' మూవీ విడుదలకు సమయం దగ్గర పడడంతో ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించారు. ఇందులో భాగంగానే తాజాగా ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ విడుదలైంది. ఉద్యోగాల కోసం అన్వేషించి విసిగిపోయిన ఓ పల్లెటూరి కుర్రాడు.. వ్యవసాయ రైతుగా ఎలా మారాడన్న కథతో ఇది రూపొందినట్లు ట్రైలర్లో చూపించారు. ఇక, ఇందులో కొండపొలాన్ని సాగు చేసే ఆ కుర్రాడికి మృగాలతో పాటు అడవిని నాశనం చేయాలనుకున్న వ్యక్తుల నుంచి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయో ఇందులో చూపించారు. ఇక, ఈ ట్రైలర్లో క్రిష్ మార్కు డైలాగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను 'కొండపొలం' అనే నవల ఆధారంగా రూపొందించినట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. అందుకు అనుగుణంగానే దీనికి అదే టైటిల్ పెట్టారు. ఫుల్ ఎమోషన్స్తో సాగే ఈ మూవీ పల్లెటూరి వాతావరణంలో తెరకెక్కింది. దీన్ని రాజీవ్ రెడ్డి - జాగర్లమూడి సాయిబాబా కలిసి నిర్మించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఎమ్ఎమ్ కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.