దిల్ రాజుకు కరోనావైరస్ పాజిటివ్.. వకీల్ సాబ్ను వెంటాడుతున్న కోవిడ్ 19
తెలుగు సినీ పరిశ్రమను కరోనావైరస్ వెంటాడుతున్నది. గత కొద్ది రోజులుగా నిర్మాత అల్లు అరవింద్, త్రివిక్రమ్ శ్రీనివాస్, నివేదా థామస్తోపాటు పలువురు సినీ ప్రముఖులకు కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. తాజా ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా కోవిడ్ బారిన పడ్డారు.
జాన్వీ కపూర్ నెవర్ బిఫోర్ గ్లామర్ షో
త కొద్ది రోజులుగా వకీల్ సాబ్ ప్రమోషన్లో తలమునకలైన ఆయన సుదర్శన్ థియేటర్లో జరిగిన రెండు కార్యక్రమాలకు హాజరయ్యారు. యూనిట్తో కలిసి సుదర్శన్ థియేటర్కు వెళ్లిన దిల్ రాజు శనివారం ఆయన ప్రేక్షకులతో సంభాషించారు.

అయితే గత రెండు రోజులుగా అస్వస్థతకు గురి కావడంతో క్వారంటైన్లోకి వెళ్లారు. అయితే ఆయనకు కోవిడ్ స్వల్పంగా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలిందనే విషయాన్ని సినీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటూ ట్రీట్మెంట్ తీసుకొంటున్నట్టు తెలిసింది.
ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ సిబ్బంది, అంగరక్షకులకు కూడా కరోనాపాజిటివ్ రావడంతో పవర్ స్టార్ కూడా స్వీయ గృహ నిర్బంధంలో ఉన్నారు.
ఇదిలా ఉండగా, సోమవారం సాయంత్రం జరిగిన వకీల్ సాబ్ సక్సెస్ మీట్కు కూడా దూరంగా ఉన్నారు. ఈ వేడుకకు కేవలం అనన్య పాండే, అంజలి, దర్శకుడు వేణు శ్రీరాం మాత్రమే హాజరయ్యారు. ఈ చిత్రం గత నాలుగు రోజుల్లో సుమారు రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. ఇంకా నిలకడగా వసూళ్లను సాధిస్తున్నది.


Click it and Unblock the Notifications











